...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఆదివారం సెలవు కదా..అని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకొంటున్నారా..!





ఆదివారం అంటే చాలా మందికి  ఆనందమే. చాలా మందికి సెలవు ఉంటుంది కాబట్టి పిల్లలకు ఎలాగూ స్కూల్ హాలీడే. పెద్దలకు ఆఫీసులకు, వ్యాపారాలకు సెలవు ఉంటుంది కాబట్టి వీకెండ్‌ ను ఎలా ఎంజాయ్‌ చేయాలా అని ఇప్పటికే ప్లాన్‌ చేసేసుకొంటారు. చాలా సందర్భాల్లో కుటుంబంతో కలిసి భోజనానికి బయటకు వెళ్లడానికి చాలామంది ఆదివారం ను ఎంచుకొంటారు. కుటుంబంతో కలిసి బయట తిరిగి రావటం అన్నది చాలా అవసరం కూడా. వారమంతా దైనందిక పనులతో అలసిపోయిన వారికి ఇది మంచి రీచార్జ్ అవుతుంది.
బయట భోజనం చేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవటం మంచిది. ఇప్పుడు చాలామంది హెల్త్ అవేర్‌నెస్‌ పెంచుకొంటున్నారు. అందుచేత ఇంటి దగ్గర లేక ఆఫీసులో భోజనం చేసేటప్పుడు హ్యాండ్‌ వాష్‌ చేయటం అలవాటు చేసుకొంటున్నారు. (ఒక వేళ మీకు కనుక ఆ అలవాటు లేకపోతే మాత్రం తప్పనిసరిగా దీన్ని అలవాటు చేసుకోండి. మేం స్పూన్‌ తో ఫుడ్‌ తింటాం కదా అని సెటైర్లు మాత్రం వేయకండి. జస్ట్ ఆ స్పూన్‌ ఎంత శుభ్రంగా ఉందో చెక్‌ చేసుకోండి చాలు) కానీ బయటకు వెళ్లినప్పుడు మాత్రం అన్ని సార్లు ఇది కుదరక పోవచ్చు. 

కొన్ని చోట్ల లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌ పెడుతున్నారు కాబట్టి దీన్ని వాడటానికి మొహమాట పడవద్దు. అప్పటిదాకా బయట తిరిగి ఆ చేతులతోనే తినటానికి రెడీ కావద్దు. కనీసం వాష్‌ లిక్విడ్‌ చిన్నబాటిల్స్ దొరకతున్నాయి కాబట్టి వాటిని అయినా వెంట తీసుకెళ్తే అయిపోతుంది. దీన్ని వాడటం మంచిది అన్న మాట తెలిసిందే కదా. మొహమాటంతో కమిట్‌ అయ్యేకంటే ఇది బెటర్‌ అనిపిస్తుంది. అక్కడ స్పూన్ లు, ఫోర్క్ లు క్లీన్ గా ఉంటాయని నమ్ముతాం కాబట్టి వాటిని వాడుకొన్నా ఫర్వాలేదు.
చిన్న జాగ్రత్త బోలెడు మేలు చేస్తుందని మరవకండి సుమా..!

అరచేతిలో టెక్నాలజీ..అద్భుతమైన ఫలితాలు






కాలం మారిపోతోంది. కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆదునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాక వాటి ఉపయోగాన్ని అందిపుచ్చుకోవటం తప్పనిసరి అవుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ సమకూర్చే ఫలితాలు చాలా కనిపిస్తున్నాయి. వైద్య శాస్త్రంలో రోగాల్ని నిర్ధారించటంలో, చికిత్సలో టెక్నాలజీ పాత్ర పెరుగుతోంది.
ఈ మద్య కాలంలో ఎండోస్కోపిక్‌ అల్ట్రా సౌండ్‌ అనే పరికరం అందుబాటులోకి వచ్చింది. గతంలో శరీరం లోపల అవయవాల పరిస్తితిని పరిశీలించేందుకు ఎండోస్కోప్‌ వాడుతూ ఉండేవాళ్లం. అల్ట్రాసౌండ్ టెక్నాలజీ కూడా ఈ దిశగా ఉపయోగ పడుతుండేది. ఇప్పుడు ఈ రెంటినీ మేళవించి రూపొందించిందే ఎండోస్కోపిక్‌ అల్ట్రా సౌండ్‌.
దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ కోశ వ్యాధుల నిర్ధారణ చికిత్సలో ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఆహార వాహిక, జీర్ణకోశం, పేగులు, పాన్‌ క్రియాస్‌, రెక్టమ్‌ వంటి భాగాల్లో క్యాన్సర్ సోకుతూ ఉంటుంది. ఇధి ఏ స్టేజ్‌ లో ఉన్నదో తెలిస్తే చికిత్స తేలిక అవుతుంది. క్యాన్సర్‌ స్టేజ్‌ నిర్ధారణ కు ఈ పరికరం ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా పాన్‌ క్రియాస్‌ లో ఏర్పడే రోగ పూరిత సిస్ట్ లు, వాపులు వంటివి సునిశితంగా పరిశీలించేందుకు ఇది సహకరిస్తుంది. కాలేయం నుంచి స్రావకాల్ని తాత్కాలికంగా నిల్వ చేసే గాల్‌ బ్లాడర్‌, బైల్ గొట్టాల్లో రాళ్లు, కణితులు ఏర్పడి ఇబ్బంది కలిగిస్తాయి. కాలేయంలో కూడా కణితులు చోటు చేసుకొంటాయి. ఇవి ఎక్కడ ఏర్పడ్డాయి, ఎంత సైజ్‌ లో ఉన్నాయి, వాటి నేచర్‌ ఏమిటి వంటి అంశాల్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. తొలి దశలో ఉండే గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌, పాన్‌ క్రియాస్‌ లో వచ్చే నీటిబుగ్గలు, కొన్ని రకాల గాల్‌ బ్లాడర్‌ ఇన్‌ ఫెక్షన్‌ లు ఆపరేషన్‌ అవసరం లేకుండానే చికిత్స చేయటానికి వీలవుతుంది.
ఈ విశిష్ట పరికరం ఇప్పుడు హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌ లో అందుబాటులోకి వచ్చింది. దీని సేవల్ని పొందేందుకు వీలవుతోందని గుర్తించుకోవచ్చు. ఇది ప్రజల అవగాహన కోసం చేసే ప్రయత్నం మాత్రమే.

టెక్నాలజీ ని ఎక్కువగా వినియోగిస్తే ఈ లాభం కూడా ఉంటుంది కదా..!




వ్యాధుల నిర్ధారణలో టెక్నాలజీ పాత్ర అంతకంతకూ పెరుగుతోంది. అధునాతన టెక్నాలజీ ని వాడటం వలన వ్యాధుల నిర్ధారణ మరింత కచ్చితంగా జరుగుతోంది.  ప్రస్తుత కాలంలో వ్యాధుల నిర్ధారణ అనేది కీలకంగా మారుతోంది. వ్యాధి నిర్ధారణ సక్రమంగా జరిగితే చికిత్స సునాయసంగా జరుగుతుంది. దీంతో రోగికి ఎంతో మేలు కలుగుతుంది. ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఎండోస్కోపిక్‌ అల్ట్రాసౌండ్‌ పాత్ర విశిష్టమైనది. ఈ సందర్భంగా ఈ పరికరం వలన కలిగే ప్రయోజనాలు చూద్దాం.
ఎండోస్కోప్, అల్ట్రాసౌండ్ పరికరాలు జీర్ణకోశ వ్యాధుల నిర్ధారణ, చికిత్సల్లో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని సమ్మిళితం చేసి రూపొందించినదే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్‌. ఈ రెండు విధానాల్ని జోడించి పంపడంతో దీని ద్వారా జీర్ణ నాళంలోని అన్ని భాగాల్ని సునిశితంగా దర్శించేందుకు వీలవుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో హై రిజల్యూషన్‌ ఉండే చిత్రాల్ని పొందవచ్చు.  ఫలితంగా అక్కడి పరిస్థితులు కళ్లకు కట్టినట్లు తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఆహార వాహిక, జీర్ణ కోశం, పేగులు, వంటి భాగాల్లో ఇబ్బందుల్ని గుర్తించవచ్చు.
క్యాన్సర్ వ్యాధుల నిర్ధారణలో బయాప్సీ పరీక్ష అన్నది ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. ఈ పరికరం ద్వారా బయాప్సీ చేయటంతో పాటు వివిధ భాగాల్లో ఏర్పడిన క్యాన్సర్ కణితుల్ని సునిశితంగా గుర్తించవచ్చు. దీంతో క్యాన్సర్ చికిత్సలు తేలిక అవుతాయి. గాల్ స్టోన్స్ లో చాలా చిన్న రాళ్లను సైతం కనుక్కోవచ్చు. క్రానిక్ పాన్ క్రియాటైటిస్ లో వ్యాధి జనిత క్రమం అర్థం చేసుకోవటం తేలికవుతుంది. జీర్ణ కోశ వ్యాధుల్లో ఇటువంటి పరికరాల తో వ్యాధి నిర్ధారణ, చికిత్స మరింత మెరుగవుతాయి.
అదే సమయంలో నిగూఢంగా ఉన్న ప్రాంతాల నుంచి (కాలేయం, క్లోమం) బయాప్సీ వంటి పరీక్షలు చేయటం వీలవుతుంది. రోగ నిర్ధారణ లోనే గాకుండా అనేక వ్యాధుల చికిత్సలోనూ ఇది ఉపయోగపడుతుంది. తొలి దశలో ఉండే గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌, పాన్‌ క్రియాస్‌ లో వచ్చే నీటిబుగ్గలు, కొన్ని రకాల గాల్‌ బ్లాడర్‌ ఇన్‌ ఫెక్షన్‌ లు ఆపరేషన్‌ అవసరం లేకుండానే చికిత్స చేయటానికి వీలవుతుంది.
ఈ విశిష్ట పరికరం ఇప్పుడు హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌ లో అందుబాటులోకి వచ్చింది. దీని సేవల్ని పొందేందుకు వీలవుతోందని గుర్తించుకోవచ్చు. ఇది ప్రజల అవగాహన కోసం చేసే ప్రయత్నం మాత్రమే.

వేడి వేడి టీ తాగటం, వేడి వేడి ఆహారం తినటంతో సమస్యలు ఉన్నాయా..



అతి వేడి ఆహారం తిన‌టం, అతి వేడి టీ తాగ‌టం, వేయించిన మాంసాహారం తీసుకోవ‌టం వంటివి త‌గ్గించుకొని దుర‌ల‌వాట్లకు దూరంగా ఉంటూ స‌మ‌తుల్య ఆహారం తీసుకొంటే జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యానికి మంచిది. లేదంటే ఇటువంటి అల‌వాట్లతో క‌డుపు లో విష‌ప‌దార్థాలు చేరి క‌డుపు క్యాన్సర్ వంటి రోగాల‌కు దారి తీస్తాయి. 
అంత మాత్రాన వేడిఆహారం తిన్న వారందరికీ క్యాన్సర్ వచ్చేస్తుందన్న మాట సరైంది కాదు. క్యాన్సర్ వచ్చే కారణాలలో ఇది కూడా ఒకటి అని మాత్రమే చెప్పవచ్చు.

   స‌రైన జీవ‌న శైలి లేక‌పోవ‌టం, దుర‌ల‌వాట్లు, జ‌న్యుప‌ర‌మైన మార్పులు, వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చే జ‌న్యు లోపాలు వంటి కార‌ణాల‌తో క‌డుపు క్యాన్సర్ ప్రబ‌లుతోంది. నిర్దిష్టమైన కార‌ణాన్ని చెప్పటం వీలు కాదు..ఆహారం మింగ‌టంలో ఇబ్బంది, ఏమీ తిన‌కుండానే క‌డుపు నిండుగా ఉండ‌టం, కొద్ది పాటి ఆహారం తిన్నా నొప్పి ,అజీర్తి, మ‌లంలో ర‌క్తం వంటి స‌మ‌స్యల‌తో దీన్ని అనుమానించాల్సి ఉంటుంది. అనుమానం ఏర్పడిన‌ప్పుడు ఎక్సురే, ర‌క్త ప‌రీక్షల‌తో పాటు ఎండోస్కోపీ, కొల‌నోస్కోపీ, సీటీ స్కాన్‌; ఎమ్ ఆర్ ఐ స్కాన్  వంటి ప‌రీక్షలు చేయించాల్సి ఉంటుంది. వ్యాధి తొలిద‌శ‌లో ఎండో స్కోపీ, కొల‌నోస్కోపీ విధానాల‌తో చికిత్స చేయ‌వ‌చ్చు. త‌ర్వాత ద‌శ‌లో ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ చేయ‌టం ద్వారా మెరుగైన ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. వ్యాధి ముదిరినప్పుడు ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ వంటి విధానాల‌తో నాణ్యమైన శేష జీవితాన్ని అందించ‌వ‌చ్చు.
    ఒక‌ప్పుడు క్యాన్సర్ వ‌చ్చిందంటే మ‌ర‌ణం త‌ప్పద‌న్న భావ‌న ఉండేది.  ఆధునిక వైద్య శాస్త్ర ప‌రిశోధ‌న‌ల‌తో చికిత్స మార్గాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ప్రతిష్టాత్మక వైద్య సంస్థల్లో ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన వైద్యులు ఈ చికిత్స మార్గాల్ని అంది పుచ్చుకొని చికిత్సలు అందించ‌గ‌లుగుతున్నారు.