...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

అమీబియాసిస్ కు అరవై కారణాలు

మన జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోనప్పుడు అమీబియాసిస్ వచ్చే అవకాశం ఉంది. నోటి ద్వారా కడుపులోకి తీసుకునే ఆహారం కారణంగానే ఈ వ్యాధి వస్తుంది. సహజంగా కలరాకు దారితీసే లక్షణాలన్నీ అమీబియాియాసిస్ కు దారితీస్తాయి. తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవడం ద్వారా అమీబియాసిస్ ను నియంత్రించవచ్చు.

                 పొగత్రాగడం, ఆల్కహాల్ సేవనం, గుట్కాలు, జర్దాలు, అమీబియాసిస్ ను మరింత పెంచుతాయి. పైగా కడుపులో అల్సర్లు రావడానికి కారణమౌతాయి.అమీబియాసిస్ లో పేగులు బాగా దెబ్బతింటాయి. దీని వల్ల దీర్ఘకాలం పాటు తిన్న ఆహారం జీర్ణం కాకుండా అలాగే ఉండిపోయి, సూక్ష్మజీవులకు నివాసస్థానంగా మారుతుంది. సూక్ష్మజీవులు పెరిగేకొద్దీ వ్యాధి తీవ్రత బాగా పెరుగుతుంది. 

కలరా వస్తే కలవరపడొద్దు

సాధారణంగా విరేచనాలు అవుతున్నాయని రోగులు డాక్టర్లకు చెబుతుంటారు. అయితే అన్ని విరేచనాలు ఒకేలా ఉండవు. అవి ఎప్పట్నుంచి అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి. విరేచనాల రంగు, వాసన ఎలా ఉందనే విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. వీటిని బట్టే డాక్టర్లు రోగికి చికిత్స విధానాన్ని నిర్ణయించగలుగుతారు. విరేచనాలకు ముందు రోగి ఏం తిన్నాడు, ఏ సమయంలో తిన్నాడనేది కూడా కలరా అవునో, కాదో నిర్థారించుకోవడానికి సహాయపడుతుంది.

                     కేవలం విరేచనాలు తగ్గించడానికి మందులివ్వడానికి ముందే.. రోగి గుండెపోటు, రక్తప్రసరణ సరిగ్గా ఉందో లేదో డాక్టర్లు అంచనా వేస్తారు. విరేచనాలు ఎలా అవుతున్నాయనే విషయాన్ని బట్టి.. అది కేవలం విరేచనాలో కాదో నిర్థారణకు వస్తారు. విరేచనాలతో పాటూ మూత్రం పడుతుంటే చాలా అపాయకరమైన పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. ఇక మూత్రం అయిన తర్వాత కూడా విరేచనాలు ఆగకపోతే అది మరింత ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచచ్చు. కలరా వచ్చినప్పుడు కలవరపడకుండా డాక్టర్ని సకాలంలో సంప్రదించడం ఉత్తమం.

అజీర్తే విరేచనాలకు మూలం

స్ప్రూ అనే విరేచనాల వ్యాధిలో అమిత దుర్వాసన ఉంటుంది. దీర్ఘకాలం విరేచనాలు ఉండటం వల్ల రోగి బరువు కోల్పోతాడు. ఇనుము వంటి పోషక పదార్ధాలు ఒంటికి వంటబట్టకపోవడంతో రోగి క్షీణించి పాలిపోతాడు. పాలు, గుడ్లు వంటివి సరిపడని శరీర తత్వం ఉన్న వ్యక్తులు జీర్ణశక్తి బాగా తక్కువగా ఉన్నప్పుడు అవి తీసుకుంటే.. తీవ్రమైన ఎలర్జీ లక్షణాలు వచ్చి విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

                         పేగులోపల విపరీతంగా పూసి పుళ్లు పడిపోయినప్పుడు అల్సరేటివ్ కోవైటిస్ అంటారు. రక్తంతో కూడిన విరేచనం, కడుపులో నొప్పి, జ్వరం ఉంటున్నప్పుడు పేగుల్లో ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని గమనించాలి. ఎపెండిసైడిటిస్ అనే కడుపు నొప్పితో కుడివైపుగజ్జల్లో నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లివర్ జబ్బుతో బాథపడే వ్యక్తికి కుడివైపు డొక్కల్లో నొప్పి వస్తుంది. పేగుల్లో ఏర్పడే తేడాల వల్ల విరేచనాలు, కడుపు నొప్పి వస్తాయి. 

కలరాతో జాగ్రత్త..!

ఆహారం ద్వారా, నీటిద్వారా కడుపులోకి చేరే హానికారక బ్యాక్టీరియా కారణంగా కలరా వస్తుంది. ఈ బ్యాక్టీరియా విరేచనాల వ్యాధికి కారణం అవుతాయి. కలరా ఊరంతా వ్యాపించినప్పుడు అతిసారం అంటారు. ఊళ్లో కలరా కేసులు ఉన్నాయని తెలిసినప్పుడు తక్కిన జనాభా అంతా కలరా వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. మానసిక వ్యాధులు, నాడీ సంబంధ వ్యాధులు కూడా ఈ వ్యాధి రావడానికి కారణం అవుతాయి.

        అమీబిక్ డిసెంట్రీ వంటి వ్యాధులు, పేగుల్లో టీబీ సూక్ష్మజీవుల వల్ల ఏ్పడే విరేచనాల వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశం ఉంది. జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి రావచ్చు. శరీరానికి సరిపడని ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి స్థితి వస్తుంది. పేగుపూత, క్రిమిసంహారకాలు పొరపాటున ఆహారం ద్వారా కడుపులోకి వెళ్లడం వల్ల కూడా కలరా వస్తుంది. 

ఎసిడిటీకి కారణాలెన్నో..!

కడుపులో మంటకు ఎసిడిటీయే కారణమని మనందరికీ తెలుసు. అతిగా ఆహారం తీసుకున్నా.. తీసుకోవాల్సినంత ఆహారం తినకపోయినా ఎసిటిడీ వస్తుంది. కాబట్టి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ప్రధానం. కడపులో మంట కారణంగా పనిచేయగల శక్తి తగ్గిపోతుంది. పుల్లటి తేన్పులు వస్తాయి. నోరు చేదుగా ఉంటుంది. పొట్ట బరువెక్కినట్లవుతుంది. కడపులో ఏదో ఉండ చుట్టినట్లు అనిపిస్తుంది.

                    గొంతులో, గుండెలో మంటగా అనిపిస్తుంది. అన్నం సహించదు. మలబద్ధకంతో పాటు మలం పచ్చగా మారుతుంది. విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఒక్కోసారి ఆ నొప్పి తగ్గడానికి  మందులు  మింగడం వల్ల మరింత ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది.  వికారంగా ఉంటుంది. గుండెల్లో, ఛాతిలో నొప్పి వచ్చి గుండెపోటు వస్తుందేమోనన్న భయం కలుగుతుంది. భయం కారణంగా అలసట, కడపులో గడబిడ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. 

కడుపు డస్ట్ బిన్ చేయొద్దు

మనకు వచ్చే వ్యాధుల్లో చాలావరకు తినే ఆహారం వల్లే వస్తాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కడుపులోకి తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటే.. మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని పెద్దలు చెబుతారు. శుభ్రత లేని ఆహారం తింటే వ్యాధులు చుట్టబెడతాయి. ముందుగా కడుపు ఉబ్బరంతో మొదలైన వ్యాధులు ముప్పేట దాడి చేస్తాయి. కడుపు ఉబ్బరానికి ఆరోజు తిన్న ఆహారమే కారణం కాదు.. కొన్నిరోజులుగా అశుభ్రమైన ఆహారం తినడమే అసలు కారణం.
     మనం బయట తినే తిళ్లను కడుపు అరాయించుకోలేకపోతే.. అవి లోపలే పేరుకుని కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయి. కడుపు ఉబ్బరం పెరిగి మలబద్ధకంగా మారుతుంది. కాబట్టి తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హోటల్ ఫుడ్, చిరుతిళ్లు తినేముందు అవి ఎలాంటి వాతావరణంలో తయారుచేస్తాయో గమనించడం చాలా ముఖ్యం. లేకపోతే మనం తినే చిన్నమొత్తం ఆహారం.. పెద్దమొత్తంలో అనారోగ్యానికి కారణమౌతుంది. కాబట్టి బయట చిరుతిళ్లు తినేవారూ పారాహుషార్. 

కడుపు మంట - అజీర్తి

ఒక్కోసారి విపరీతమైన ఆకలి వేస్తుంది. వడ్డించింది సరిపోదేమో అనిపిస్తుంది. కానీ కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకో ముద్ద తిందామంటే  పొట్ట బరువెక్కిపోతుంది. ఇంక మెతుకు కూడా దిగని పరిస్థితి వస్తుంది. సరే అని చెయ్యి కడుక్కుంటే.. మళ్లీ కాసేపటికే ఆకలి వేస్తుంది. తట్టుకోలేక ఏది కనిపిస్తే అది తినేద్దాం అనిపిస్తుంది. ఇదే అజీర్తి కథ.
           ఇప్పటిదాకా వేసింది నిజమైన ఆకలి కాదు. మాయా ఆకలి. అది కడుపులో మంట. కడుపులోకి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అలాగే ఉండిపోవడం వల్ల అజీర్తి చేస్తుంది. ఆహార పదార్థాల ఆమ్లీకరణ తర్వాత చిన్నపేగుల్లో శోషణ జరుగుతుంది. తర్వాత పెద్దపేగుల ద్వారా మూత్రపిండాల్లోకి వ్యర్థపదార్థాలు చేరతాయి. అయితే శోషణ సరిగా జరగకపోతే అజీర్తి వస్తుంది. 

అన్నం తినకపోవడం.. దీర్ఘకాలిక వ్యాధి

వ్యక్తిగత అలవాట్లను బట్టి జీవితాంతం వెంటాడే సమస్య గ్యాస్ ట్రబుల్. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీన్నేగ్యాస్ట్రైటిస్ అని కూడా అంటారు. గ్యాస్ట్రైటిస్ లో పేగుల్లోపలి పొరలు వాచిపోతాయి. అన్నం సహించకపోవడం, ఆకలి లేకపోవడం, వికారం, విరోచనాలు వంటివి గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. సాయంకాలం కంటే పొద్దున పూటే ఈ బాథలు ఎక్కువగా ఉంటాయి. పేగుపై పూత అంటే గ్సాస్ట్రిక్ అల్సర్ ఉన్నా కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. ప్యాంక్రియాజ్ క్యాన్సర్ వచ్చినప్పుడు, లివర్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
            రోజువారీ తినే అన్నమా కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఆ అన్నం తినే అలవాట్లను బట్టి కూడా దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలను అంచనా వేయొచ్చు. ఎప్పుడో ఓసారి అన్నం మానేస్తే పర్వాలేదు కానీ.. తరచుగా అన్నం తినాలని అనిపించకపోతే మాత్రం తప్పనిసరిగా అనునామనించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ అన్నం తినాలనిపించకపోవడం టీబీ, క్యాన్సర్, గ్యాస్ట్రైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

అన్నం సహించట్లేదా..?

అన్నం వాసన తెలియకపోవడం, అీన్నపు రుచి తెలియకపోవడం, ఆస్వాదించలేకపోవడం, ఒక రుచికి, మరో రుచికి తేడా తెలియక పోవడం, నోటిలోపల అసహ్యకరమైన ఏదో రుచి ఉండటం వంటివన్నీ.. అన్నం సహించట్లేదనడానికి సంకేతాలు. నోటి దుర్వాసన, మన ఊపిరి ఇతరులకు అసహ్యం కలిగిస్తుందనే భయంతో శ్వాస బిగపట్టడం కూడా దీని లక్షణాలే.
       రక్తహీనత కారణంగా రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోయి ఆ ప్రభావం ఎర్రరక్తకణాలతో పాటు జీర్ణకోశవ్యవస్థ మీద కూడా ఉంటుంది. దీని వల్ల ఆక్సిజన్ శరీరానికి అందడం తగ్గిపోయి జీవక్రియలో లోపాలు ఏర్పడతాయి. వీటితో పాటు మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. ఆకలి మందగించడం, వికారం, మలబద్ధకం వంటి వన్నీ రక్తహీనత లక్షణాలే. 

కడుపు మంటే.. పేగుపూత

మనకు చాలా కోపం వచ్చినప్పుడు తెలియన ఆందోళన, అసంతృప్తికి గురవుతాం. కొంతమందికి కోపం వస్తే వాళ్లేం చేస్తున్నారో కూడా వారికే తెలియదు. అనవసర ఆందోళన, అసంతృప్తి కోపంతో పాటు కడుపు మంటకు కూడా కారణమౌతాయి. కడుపుమంట దీర్ఘకాలం ఉంటే అది పుళ్లుగా ఏర్పడి.. పేగుపూతకు దారితీస్తుంది. నాలికపూస్తే ఎర్రగా అయి మంట పెట్టినట్లే.. పేగుల్లో యాసిడ్ ఎక్కువైతే ఎర్రగా మారి పొక్కిపోతాయి.
             పేగుపూత ఉన్నవారికి పొట్ట మీద చెయ్యి వేస్తే నొప్పిగా ఉంటుంది. కడపు లోపల్నుంచి విపరీతమైన నొప్పి ఉంటుంది. కొంతమందికి ఆహారం తీసుకుంటే నొప్పి పెరుగుతుంది.  భోజనం చేయగానే అనీజీగా ఉంటుంది. వికారం వాంతి వస్తున్నట్లు ఉంటుంది. భోజనం కాస్త ఆలస్యమైతే కడుపులో ఏదో అవుతున్నట్లుగా ఉంటుంది. కొంచెం తినగానే కడపు నిండటం, మళ్లీ వెంటనే ఆకలి వేయడం పేగుపూత లక్షణాలు. పేగుపూత లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.

బయటి తిళ్లతో జాగ్రత్త..!

బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో టైం పాస్ కోసం బయటి తిళ్లు తినడం మనలో చాలా మందికి ఉండే అలవాటు. అయితే మనం తీసుకునే ఆహారపదార్ధాలు శుభ్రంగా ఉన్నాయో.. లేదో చూసుకోకపోతే అవి గ్యాస్ట్రైటిస్ కు దారితీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 
1. సాధారణంగా రైలు, బస్సు ప్రయాణాల సమయంలో బయటి ఆహారపానీయాలు తీసుకుంటాం. వీటిలో చాలావరకు అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయబడతాయి. 
2. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు విందు భోజనంలో కూడా ఆహారం, పానీయాలు తినడం, తాగడం తప్పనిసరి. ఇక్కడ ఆహారం కూడా ఎంతో కొంత కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. 
3. హోటళ్లలో, హాస్టళ్లలో, మిర్చిబళ్ల దగ్గర తినే ఆహారం ఎక్కువశాతం కలుషితమై ఉంటుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. 
4. ఇంట్లో తాగే నీరు కూడా పంచాయతీ, మున్సిపాలిటీ సప్లై చేసే నీళ్లు ఎంతవరకు శుభ్రంగా ఉంటుందో చెప్పడం కష్టమే. కలుషిత నీరు తాగినా గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సుంది.  
5. గోళ్లల్లో ఉండే మట్టి కూడా తినే ఆహారం ద్వారా పేగుల్లోకి చేరి రోగాలకు దారితీస్తుంది.

వామ్మో కడుపునొప్పి..!

కడుపునొప్పి రాని మనిషంటూ ఉండడు. ఆమాటకొస్తే కడుపులోకి ఆహారం తీసుకునే సమస్త జంతువులు కడుపునొప్పికి మినహాయింపు కాదు. పేగుల లోపల అలజడి కలిగినప్పుడు కడుపు తరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. పేగుకు సంబంధించిన వ్యాధులతో పాటు లివర్ మరియి స్ప్లీన్ వ్యాధులు, పాంక్రియాజ్, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు , గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా పేగుల్లో అలజడికి కారణమౌతాయి.
      తరచూ ఆకలి మందగించడం, వాంతి, వికారం, కడుపులో బరువుగా ఉండటం, కడుపు నొప్పిగా ఉండం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. గ్యాస్ట్రయిటిస్ ఉందేమో పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. వాంతి అయినప్పుడు కొద్దిగా నెత్తుటి జీర కనిపించినా, నెత్తురు పడినా అది తప్పకుండా గ్యాస్ట్రయిటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. పొట్టలోపల సూక్ష్మజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ఈ గ్యాస్ట్రయిటిస్ రావడానికి ప్రధాన కారణం. 

ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రస్తుత ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎక్కువగా డబ్బు సంపాదించేవారు కాదు.. అందరికంటే ఆరోగ్యంగా ఉన్నవారే. కాలుష్యం పెరిగిపోతున్న నేటిరోజుల్లో.. జీవనశైలిలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వేగవంతమైన జీవనశైలితో ఆహారపు అలవాట్లు, నిద్ర సమయంలో కూడా తేడాలు ఉంటున్నాయి. ఈ తేడాలు ఓ పరిమితి దాటనంత వరకు ఓకే. కానీ ఏమాత్రం పరిమితి దాటినా మన అలవాట్లే రోగాలకు ఆహ్వానం పలికినట్లవుతుంది.
        ఎలాంటి జీవనశైలి ఉన్నవారికి అయినా సరిపోయే విధంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవచ్చు. కానీ అవి తప్పకుండా ఆరోగ్యకరమైన అలవాట్లయి ఉండాలి. మన జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయంలో మనం డాక్టర్ల సలహాలు తప్పక పాటించాలి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా.. తర్వాతి కాలంలో అదే పెద్ద జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మన ఆరోగ్య పరిరక్షణ మన ఆహారపు అలవాట్లలోనే ఉందన్న సంగతి గుర్తుంచుకోవాల్సిన అసరం ఉంది. 

త‌క్కువ ఖ‌ర్చుతో అధునాత‌న వైద్యం సాధ్య‌మేనా..!


అవును.. త‌క్కువ ఖ‌ర్చుతో అధునాత‌న వైద్యం సాధ్య‌మే అని నిరూపించారు డాక్ట‌ర్ రాఘ‌వేంద్రరావు. స‌ర్వేంద్రియాణాం అవ‌యవం ప్రధానం అనుకోవ‌చ్చు. ఎందుకంటే మాన‌వ శ‌రీరంలో అన్ని అవ‌యవాల‌కు ఆయా ప్రాధాన్యత ఉంటుంది. కానీ కొన్ని అవ‌య‌వాల విష‌యంలో మాత్రం ఎక్కువ ప్రధానం అనుకోవాలి. ఎందుకంటే ఈ అవ‌య‌వాలు..త‌మ ప‌నితీరులో విఫ‌లం అయితే, లేదా చెడిపోతే..ఇత‌ర అవ‌య‌వాలు ఏమీ వాటి ప‌నులు చ‌క్కబెట్టలేవు. అటువంటి కీల‌క అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. జ‌న‌గామ్ కు చెందిన విజ‌య్ కుమార్ విష‌యంలో అదే జ‌రిగింది. 
 వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గాం కు చెందిన విజ‌య్ కుమార్ కు కాలేయం చెడిపోయింది. మందులు, శ‌స్త్ర చికిత్సలు కూడా విఫ‌ల‌మైన ద‌శ కు కాలేయం చేరుకొంది. ఈ ద‌శ‌లో నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాలజీ (సాయివాణి సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి)ని సంప్రదించ‌టం జ‌రిగింది. హాస్పిట‌ల్ లోని స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు అండ్ లివ‌ర్ ట్రాన్సుప్లాంట్ స‌ర్జన్ డాక్టర్ ఆర్ వీ రాఘ‌వేంద్రరావు  పేషంట్ ను ప‌రిశీలించి, కాలేయ మార్పిడి ద్వారానే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిర్ధారించారు. ద‌క్షిణ కొరియాలో కాలేయ మార్పిడిలో శిక్షణ పొంది, అనేక మందికి విజ‌య‌వంతంగా కాలేయ మార్పిడి చేసిన డాక్టర్ ఆర్ వీ రాఘ‌వేంద్రరావు ఇందుకు గ‌ల మార్గాల్ని అన్వేషించారు. 
ఈలోగా జూన్ 22న జీవ‌న్ ధాన్ ప‌థ‌కం ద్వారా విజ‌య‌వాడ‌లో ఒక యువ‌కుడు బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు స‌మాచారం అందింది. అప్పుడు డాక్టర్ రాఘ‌వేంద్ర రావు బృందం అప్పటిక‌ప్పుడు విజ‌య‌వాడ బ‌య‌లు దేరింది. అక్కడ పిన్నమ‌నేని వైద్య క‌ళాశాల ఆసుప‌త్రి లో బ్రెయిన్ డెడ్ అయిన పి. నాగ‌బాబు నుంచి కాలేయాన్ని శ‌స్త్ర చికిత్స ద్వారా వేరు చేసి, అప్పటిక‌ప్పుడు  విమానంలో   హైద‌రాబాద్‌కు తీసుకొని వ‌చ్చారు. దాన్ని 12 గంట‌ల్లోగా గ్రహీత శ‌రీరంలో అమ‌ర్చాలి. అందుకే ఆ 8-9గంట‌ల పాటు స‌ర్జరీ చేసి ఈ కాలేయాన్ని విజ‌య వంతంగా రోగి శ‌రీరంలో అమ‌ర్చటం జ‌రిగింది.
వారం రోజులు ఐసీయూలో ఉంచి అబ్జర్వ్ చేసిన త‌ర్వాత సాధార‌ణ వార్డుకి మార్చటం జ‌రిగింది. పేషంట్ పూర్తిగా కోలుకోవ‌టంతో డిశ్చార్జ్ చేయాల‌ని నిర్ణయించారు.

ఈ సంద‌ర్బంగా నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాలజీ (సాయివాణి సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి) డైర‌క్టర్ రాఘవేంద్రరావు పాత్రికేయుల‌తో మాట్లాడుతూ.. త‌క్కువ ఖ‌ర్చుతో మెరుగైన చికిత్స అందించ‌టం ల‌క్ష్యంగా త‌మ సంస్థ ప‌నిచేస్తోందని వివ‌రించారు. అధునాతన టెక్నాల‌జీ ఉప‌యోగించి, నిపుణులైన వైద్యుల‌తో సంక్లిష్టమైన ఆప‌రేష‌న్ లు సైతం విజ‌య‌వంతంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ కు ఇత‌ర కార్పొరేట్ సంస్థల‌తో పోలిస్తే స‌గం ధ‌ర‌కే తాము చేయ‌గ‌లిగామ‌ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా పేషంట్ విజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. త‌మ‌కు చికిత్స అందించిన డాక్టర్ రాఘ‌వేంద్రరావు, బృందానికి కృత‌జ్ఞత‌లు తెలిపారు.

ఎండ‌లు పెరిగాయిగా .. ఈ సంగ‌తి మ‌రిచిపోకండి..!


వేస‌వి వ‌చ్చేసింది. ఎండ‌లు మండుతున్నాయి. ఎండ‌ల్లో తిర‌గ‌క త‌ప్ప‌దు క‌దా. కానీ బాగా ఎండ‌ల్లో తిరిగిన‌ప్పుడు చాలా మంది చేసే చిన్న పొర‌పాటు ఏమిటంటే.. చ‌ల్ల‌ద‌నం కోసం వెంట‌నే బాగా కూల్ గాఉండే వాట‌ర్ తాగేస్తారు. అప్పుడ‌ప్పుడ చ‌ల్ల‌టి నీరు తీసుకోవ‌టం వేరు.కానీ, బ‌య‌ట ఎండ‌లో బాగా తిరిగిన‌ప్పుడు శ‌రీరంలో ద్ర‌వ‌ణ స్థితి త‌గ్గి ఉంటుంది. అప్పుడు బాగా కూల్ వాట‌ర్ తాగితే అది మామూలు స్థితికి రావ‌టానికి బాగా స‌మ‌యం తీసుకొంటుంది. అందుకే బ‌య‌ట బాగా ఎండ‌లో తిరిగి వ‌చ్చిన‌ప్పుడు మామూలు నీరు తీసుకోవ‌టం మంచిది. నీళ్లు ఎక్కువ తాగ‌టం అన్న‌ది మంచిదే. చ‌ల్ల‌టి నీరు తీసుకోవ‌చ్చు. కానీ ఈ రెండు సూత్రాలు బాగా ఎక్కువైతే మాత్రం మంచిది కాదు. అదే ప‌నిగా నీటిని లీట‌ర్ల కొద్దీ ప‌ట్టించ‌టం కూడా మంచిది కాదు. నియ‌మితంగా కావ‌ల‌సిన నీరు తాగితే స‌రిపోతుంది. ఐస్ గ‌డ్డ‌లుఉన్న నీటిని తాగ‌టం, రోజంతా కూల్ వాట‌ర్ తాగుతూనే గ‌డ‌ప‌టం అంత మంచిది కాద‌ని గుర్తించుకోవాలి. 

క్యాన్స‌ర్ అంటే భ‌య‌మేలా..!


క్యాన్స‌ర్ అంటే చాలా మందికి భ‌యం. దీనికి మందు లేద‌ని అనుకొంటారు. కానీ ఇది అపోహ‌. క్యాన్స‌ర్ అనేది ప్ర‌మాద‌క‌రం అనటంలో సందేహం లేదు. క్యాన్స‌ర్ ముదిరిపోతే కాపాడటం క‌ష్టం అనేది అంతే వాస్త‌వం. అయితే ఆధునిక వైద్య ప‌రిశోధ‌న‌ల పుణ్య‌మా అని క్యాన్స‌ర్ పై ప‌రిశోధ‌న‌లు బాగా పెరిగాయి. దీంతో చాలా వ‌ర‌కు క్యాన్స‌ర్ కేసుల్లో చికిత్స‌లు సాధ్యం అవుతున్నాయి.

జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని అనేక భాగాల్లో క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఆహార వాహిక‌, జీర్ణాశ‌యం, చిన్న పేగు, పెద్ద పేగు, రెక్ట‌మ్ ల‌తో పాటు కాలేయం, క్లోమం అనే అనుబంధ గ్రంథుల్లో క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. వీటిలో ప్రాథ‌మిక క్యాన్స‌ర్ అంటే అక్క‌డే పుట్టి, అక్క‌డే విస్త‌రించే క్యాన్స‌ర్ లేదా ద్వితీయ క్యాన్స‌ర్ అంటే వేరే చోట పుట్టి ఇక్క‌డ‌కు వ‌చ్చి తిష్ట వేసే క్యాన్స‌ర్ లు ఉన్నాయి. అయితే ఈ క్యాన్స‌ర్ ల‌ను ఫ‌లానా ల‌క్ష‌ణాల‌తో గుర్తించ‌టం క‌ష్టం. సాధార‌ణంగా ఉండే లక్ష‌ణాలే క‌నిపిస్తాయి. కానీ రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌తో గుర్తించ‌వ‌చ్చు.

అయితే క్యాన్స‌ర్ నిర్ధార‌ణ అయితే మాత్రం భ‌య ప‌డిపోవాల్సిన అవ‌స‌రం లేదు. నిపుణులైన వైద్యుల్ని సంప్ర‌దిస్తే చికిత్స అందించేందుకు వీల‌వుతుంది. ఇటీవ‌ల కాలంలో ఆధునిక ప‌రిశోధ‌న‌లు, టెక్నాల‌జీ సాయంతో మెరుగైన చికిత్స‌ను స‌మ‌ర్థ‌వంతంగా అందించేందుకు వీల‌వుతోంది. దీంతో క్యాన్స‌ర్ ను అదుపు చేయ‌టం వీల‌వుతోంది. మ‌రీ ముదిరిపోయిన కేసుల్లో నాణ్య‌మైన శేష జీవితాన్ని అందించ‌టం జ‌రుగుతోంది. 

మీ ఆరోగ్యం మీ చేతుల్లో..!

విన‌టానికి అతి శ‌యోక్తి గా ఉన్నా ఇది నిజం. ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌టం చాలా వ‌ర‌కు మ‌న చేతుల్లోనే ఉంటుంది. చిన్న పాటి విష‌యాల్లో జాగ్ర‌త్త తీసుకోవ‌టం, ఆరోగ్యం ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌టం ముఖ్యం అన్న మాట‌.
ఇవాళ వ‌ర‌ల్డ్ హెల్త్ డే. ఈ సంద‌ర్భంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకొనే వారంద‌రికీ శుభాకాంక్ష‌లు. 

ఇవాళ ఏడో తేదీ కాబ‌ట్టి ఏడు ముఖ్య విష‌యాల్ని మ‌న‌నం చేసుకొందాం.
1. చేతుల శుభ్ర‌త చాలా ముఖ్యం. ఆహారం తిన‌టం ద‌గ్గ‌ర నుంచి ర‌క ర‌కాల ప‌నుల‌కు ఉప‌యోగిస్తాం. వీటిని త‌ర‌చుగా స‌బ్బు నీటితో శుభ్రం చేసుకొంటే వేలాదిక్రిముల‌ను దూరం పెట్ట‌వ‌చ్చు. ముఖ్యంగా ఆహారం తీసుకొనే ముందు, మ‌ల మూత్ర విస‌ర్జ‌న త‌ర్వాత మ‌రిచిపోకుండా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.
2. గోళ్ల‌ను క‌త్తిరించుకోవ‌టం చాలా ముఖ్యం. లేదంటే క్రిములు అక్క‌డ స్థిర‌ప‌డి, ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
3. ఆహారం తీసుకొనేందుకు స‌మ‌య పాల‌న పాటించాలి. అంటే ఉద‌యం టిఫిన్ తీసుకొనేందుకు, మ‌ధ్యాహ్నం మ‌రియు రాత్రి ఆహారం తీసుకొనేందుకు ఒకే ర‌క‌మైన స‌మ‌యాన్ని అనుస‌రించాలి.
4. ఆహారం స‌మ‌తుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అంటే కేవ‌లం పిండి ప‌దార్థాలు,కొవ్వులేకాకుండా ప్రోటీన్స్ మ‌రియు విట‌మిన్స్ ఉండేట్లు జాగ్ర‌త్త తీసుకోవాలి.
5. ప‌ని ఒత్తిడిలో కొంత మంది విరేచ‌నాన్ని వాయిదా వేస్తుంటారు. ఇది మంచిది కాదు, స‌కాలంలో తిన‌టం, స‌క్ర‌మంగా వ్య‌ర్థాల్ని బ‌య‌ట‌కు పంపించండం చాలా ముఖ్యం.
6. ఆహారం తిన్న త‌ర్వాత వెంట‌నే నిద్ర‌కు ఉప‌క్ర‌మించ‌టం మంచిది కాదు. తేలిక‌పాటి క‌ద‌లిక‌ల‌తో ఆహారం స‌క్ర‌మంగా జీర్ణం అవుతుంది,కొవ్వులు పేరుకోకుండా ఉంటాయి.

7. ఆహారంతో పాటు త‌గినంత ప‌రిణామంలో నీరు తాగుతూ  ఉండాలి. మిగిలిన వేళ‌ల్లో కూడా నీరు తాగ‌టం మంచిది.

ఉగాది గ్రీటింగ్స్ ఇలా ఉండాలి

తెలుగు వారికి తెలుగు ఉగాది   అభినందనలు . తెలుగు లో అభినందనలు అందిస్తే బాగుంటుంది కదా ..





కావ‌లిసిన వారికి కావ‌లిసినంత‌..!


శ‌రీరానికి శ‌క్తి అందాలంటే ఆహారం త‌ప్ప‌నిస‌రి. అయితే ఆహారంలో అన్ని ర‌కాల ప‌దార్థాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. కానీ ద‌క్షిణ భార‌త దేశంలోని సాంప్ర‌దాయిక కుటుంబాల్లో ఉద‌యం ఇడ్లీ, దోశ మ‌ధ్యాహ్నం అన్నం, సాయంత్రం కూడా అన్నం లేదా ఇడ్లీ ల‌తో గ‌డిపేస్తుంటారు. దీంతో చాలా మందిలో ప్రోటీన్ల లోపం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

శ‌రీరానికి పిండి ప‌దార్థాలు ఎంత అవ‌స‌ర‌మో, ప్రోటీన్లు కూడా అంతే అవ‌స‌రం. శ‌రీరంలో కండ‌రాల ప‌టిష్ట‌త‌కు, అవ‌య‌వ భాగాల ప‌టిష్ట‌త‌కు ప్రోటీన్లు అవ‌స‌రం అవుతాయి. శ‌రీర బ‌రువుకు త‌గిన‌ట్లుగా ప్రోటీన్లు తీసుకోవ‌టం చాలా అవ‌స‌రం. కానీ మ‌న‌లో చాలా మంది ఈ అంశాన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. దీంతో కొవ్వులు పేరుకొని పోయి ఊబ‌కాయం రావ‌టం, శ‌రీర భాగాలు ప‌టిష్టంగా లేక‌పోవ‌టం సంభవిస్తుంటుంది. ఒక లెక్క ప్ర‌కారం శ‌రీరం ఎంత బ‌రువు అంటే అన్ని గ్రాముల ప్రోటీన్లు ప్ర‌తీ రోజు తీసుకోవాల‌ని చెబుతారు. అంటే ఒక వ్య‌క్తి 60 కిలోల బ‌రువు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్లు, లేదంటే క‌నీసం 50 గ్రాముల ప్రోటీన్లు అయినా తీసుకోవాలి.
 మ‌నం తీసుకొనే ఆహారంలో కోడి గుడ్డు లో అత్య‌ధికంగా ప్రోటీన్లు ల‌భిస్తాయి. అందుకే ఎదిగే పిల్ల‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా గుడ్డు ఇవ్వాల‌ని చెబుతారు. పాల‌లో కూడా స‌మృద్ధిగా ప్రోటీన్లు ల‌భిస్తాయి. మాంసం, చేప‌ల్లో చిక్క‌టి ప్రోటీన్లు ఉంటాయి. వీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకొంటే ప్రోటీన్లు పుష్కలంగా దొర‌కుతాయి. శాకాహారులైతే సోయా, చిక్కుళ్లు, బీన్స్ వంటి పీచు ప‌దార్థాలు ఉండే కూర‌గాయ‌ల్ని అధికంగా తీసుకోవాలి. ప్ర‌తీ రోజు కాక‌పోయినా వారం లో వీటి సంఖ్య అధికంగా ఉండేట్లు చూసుకొంటే మంచిది. 

మ‌న జాగ్ర‌త్తే మ‌నకు శ్రీరామ ర‌క్ష‌..!


జాగ్ర‌త్త ను మించిన త‌రుణోపాయం ఎప్పుడూ ఉండ‌దు. ముఖ్యంగా సామాజిక అంశాల్లో చిన్న పాటి జాగ్ర‌త్త‌లు కూడా భ‌లే ఉప‌యోగ ప‌డ‌తాయి.
హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం స్వైన్ ఫ్లూ గురించి చ‌ర్చ బాగా జ‌రుగుతోంది. వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌టం, వేల సంఖ్యలో అనుమానాస్ప‌ద కేసులు ఉండ‌టంతో ఇది క‌ల‌క‌లం రేపుతోంది.
స్వైన్ ఫ్లూ అనేది వైర‌స్ ద్వారా వ‌చ్చే రోగం. ఇది అంటు వ్యాధి. ప్రధానంగా పందులు సంచ‌రించే చోట‌, వాటి నుంచి మ‌నుషులు సంక్ర‌మిస్తుంది. కానీ,  స్వైన్ ఫ్లూ సోకిన రోగి ద‌గ్గినా, తుమ్మినా .. వాటి నుంచి ఈ వైర‌స్ ఇత‌రుల‌కు వ్యాపిస్తుంది. అందుచేత ఈ వైర‌స్ సోకకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. అయితే దీని నివార‌ణ కోసం చాలా మంది ర‌క ర‌కాల మాస్క్ లు ముక్కుకు ధ‌రించి తిరిగేస్తున్నారు. నాణ్య‌త క‌లిగిన మాస్క్ లు అయితే బాగా ప‌నిచేస్తాయి. దీన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మార్చేయ‌టం మేలు. లేనిపక్షంలో చేతి రుమాలును 4 మ‌డ‌త‌లుగా వేసుకొని ధ‌రించ‌వ‌చ్చు.
అంత‌కు మించి వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించ‌టం చాలా ముఖ్యం. రోజుకి నాలుగైదు సార్లు చేతిని స‌బ్బుతో క‌డుక్కోండి. వ్యాధి కార‌క ప్ర‌దేశాలు,అంద‌రు వాడే బ‌ట‌న్స్ మీద ఎక్కువ వేళ్ల‌ను ఉప‌యోగించ‌కండి. అప‌రిశుభ్ర ప్రాంతాల్లో ఆహారం తీసుకోవ‌డాన్ని సాధ్య‌మైనంత దూరం పెట్టండి. సామాజిక శుభ్ర‌త, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వండి.
స్వైన్ ఫ్లూ కు ప్ర‌స్తుతం టీకాలు దొర‌కుతున్నాయి. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి మాత్రం కాదు. అవ‌గాహ‌న క‌లిగి ఉండే స‌రిపోతుంది.

ఈ రోజు ప్రాధాన్యం మీకు తెలుసు క‌దా..!

ఏ అంశం మీద‌నైనా అవ‌గాహ‌న పెంచుకోవ‌టం చాలా అవ‌స‌రం. ఆరోగ్య విష‌యాల్లో ఇది చాలా వాస్త‌వం. అందుకే అవ‌గాహ‌న కోసం ఇటువంటి ఆర్టిక‌ల్స్ ఎక్కువ‌గా రాయ‌టం జ‌రుగుతోంది.
ఫిబ్ర‌వ‌రి 4 న ప్ర‌పంచ క్యాన్స‌ర్ అవ‌గాహ‌న రోజుగా పాటిస్తున్నాం. ఆక‌స్మిక మ‌ర‌ణాల‌కు దారి తీస్తున్న క్యాన్స‌ర్ నుంచి మాన‌వాళిని సంర‌క్షించేందుకు, క్యాన్స‌ర్ ముప్పును సాధ్య‌మైనంత త‌గ్గించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా దీన్ని పాటించ‌టం జ‌రుగుతోంది. దీన్ని మొద‌ట‌గా యూనియ‌న్ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్యాన్స‌ర్ కంట్రోల్ సంస్థ దీనికి నాంది ప‌లికింది. 2008 లో దీనికి పూర్తి స్థాయిలో సాధికార‌త ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచి క్యాన్స‌ర్ అవ‌గాహ‌న రోజును పాటించ‌టం జ‌రుగుతోంది. 2020 నాటిక‌ల్లా సాధ్య‌మైనంత వ‌ర‌కు క్యాన్స‌ర్ మ‌ర‌ణాలు, క్యాన్స‌ర్ ప్రాణాంత‌క ప‌రిస్థితుల్ని త‌గ్గించే ల‌క్ష్యంతో దీన్ని పాటిస్తున్నారు.

క్యాన్స‌ర్ అంటే శ‌రీరంలోని ఏదైనా భాగంలో పెరిగిపోతున్న అవాంఛిత క‌ణ‌జాలం అన్న మాట‌. అంటే శ‌రీరంలో ఉండే స‌జీవ క‌ణ‌జాలాన్ని క్ర‌మంగా నాశ‌నంచేస్తూ ఆ ప్రాంతంలో ఈ క‌ణ‌జాలం తిష్ట వేస్తుంది. క్ర‌మంగా ఇది క‌ణితి గా మారి ఆ అవ‌య‌వాన్ని క‌బ‌ళించి వేస్తుంది. ఫ‌లితంగా అత్యంత ప్ర‌మాద‌కారిగా మారుతుంది. ఇది ఎముక‌లు, చ‌ర్మం, మూత్ర పిండాలు, గొంతు వంటి భాగాల‌తో పాటు జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని ఆహార వాహిక‌, క‌డుపు, పేగులు, కాలేయం, క్లోమం వంటి భాగాల్లో ఏర్ప‌డుతుంటుంది.
జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఏర్ప‌డే క్యాన్స‌ర్ ల‌కు నిర్దిష్టంగా కార‌ణం చెప్ప‌లేం. దుర‌ల‌వాట్లు, ఇత‌ర వ్యాధులు ముద‌ర‌టం, జ‌న్యు ప‌రంగా లోపాలు, ఇత‌ర కార‌ణాల‌తో త‌లెత్తుతుంటుంది. దీనికి ల‌క్ష‌ణాలు కూడా ర‌క ర‌కాలుగా ఉంటాయి. ఆక‌లి లేక‌పోవ‌టం, బ‌రువు త‌గ్గ‌టం, నీర‌సం, చేతికి ఎత్తుగా త‌గ‌ల‌టం వంటి వాటితో పాటు గుర్తించాల్సిన సంకేతాలు ఉంటాయి. ఈ క్యాన్స‌ర్ ల‌ను స్కానింగ్‌,ఎక్సురే, బ‌యాప్సీవంటి ప‌రీక్ష‌ల తో గుర్తిస్తారు.
క్యాన్స‌ర్ నిర్ధార‌ణ అయితే చికిత్స వేగంగా ప్రారంభించాల్సి ఉంటుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని క్యాన్స‌ర్ ల‌కు ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ అవ‌స‌రం అవుతుంది. అంటే స్ప‌ష్టంగా క్యాన్స‌ర్ నిర్ధార‌ణ అయిన భాగాన్ని గుర్తించి అక్క‌డి క్యాన్స‌ర్ క‌ణితిని పూర్తిగా తొల‌గించాలి. ముదిరిన ద‌శ‌లో ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ వంటి చికిత్స‌లు అవ‌స‌రం అవుతుంటాయి.
ఆధునిక వైద్య శాస్త్రం ద్వారా క్యాన్స‌ర్ కు మందులు ల‌భ్యం అవుతున్నాయి. ఇది ప్రాణాంత‌కం అనో, క్యాన్స‌ర్ వ‌స్తే మ‌ర‌ణం ఖాయం అనో భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. చాలా వ‌ర‌కు క్యాన్స‌ర్ కేసులు ఆప‌రేష‌న్ త‌ర్వాత న‌యం అవుతున్నాయి. మరీ ముదిరి పోయిన కేసు్లో కూడానాణ్య‌మైన శేష జీవితాన్ని ఇచ్చేందుకు వీల‌వుతుంది. అందుచేత క్యాన్స‌ర్ మీద అంద‌రూ అవ‌గాహ‌న పెంచుకోవ‌టం అవ‌స‌రం.

కొన్ని కొన్ని విష‌యాల్ని వ‌దిలేస్తే ప్ర‌మాదం సుమా.. ముందు జాగ్ర‌త్తే శ్రీరామ ర‌క్ష‌..!

చిన్న చిన్న విష‌యాల్ని నిర్ల‌క్ష్యం చేయటం చాలా మందికి అల‌వాటు. ఆరోగ్యం విష‌యంలో చాలా మంది ఈ పని చేస్తుంటారు. రోగ ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డిన‌ప్ప‌టికీ వాటికి త‌గిన వైద్యం చేయించుకోకుండా నాన్చుతుంటారు. త‌ర్వాత కాలంలో అవి పెద్ద విష‌యాలుగా మారుతుంటాయి.
మొన్నీ మధ్య‌న మా హాస్పిట‌ల్ లో ఒక కేసు తీసుకోవ‌టం జ‌రిగింది. పేషంట్ (పేరు వ‌ద్దులెండి) ఒక మ‌ధ్య వ‌య‌స్కుడు. ఆయ‌న మీదనే ఆయ‌న కుటుంబం ఆధార ప‌డి ఉంటుంది. ఆయ‌న‌కు త‌ర‌చు క‌డుపు నొప్పి వ‌స్తు ఉండేది. దానికి స్థానికంగా దొరికే మందులు వేసుకొంటూ ఉండేవాడు. అప్ప‌టిక‌ప్పుడు త‌గ్గిపోతుండ‌టంతో బండి న‌డిపించేశాడు. త‌ర్వాత కాలంలో క‌డుపు ద‌గ్గ‌ర వాపు క‌నిపించ సాగింది. ఈ లోగా కామెర్లు కూడా తోడ‌య్యాయి. అప్పుడు వైద్యుల్ని సంప్ర‌దించాడు. స్థానిక వైద్యులు దాని తీవ్ర‌త‌ను గ‌మ‌నించి నా ద‌గ్గ‌ర‌కు పంపించారు. కాలేయం లో ప‌రీక్ష‌లు చేయిస్తే క‌ణితి ఉన్న‌ట్లు తేలింది.


పై ఫోటో లో ఉన్న‌ట్లుగా కాలేయం అంటే దాదాపు 10 సెంటీ మీట‌ర్ల నిడివి ఉండి, 2 కిలోల దాకా బ‌రువు ఉండే ఒక త‌మ్మె వంటి గ్రంథి. ఇందులో క‌ణితుల్ని అప్పుడ‌ప్పుడు చూస్తుంటాం. కానీ ఈయ‌న కాలేయంలో సుమారు 5 కిలోల క‌ణితి పేరుకొని పోయింది.(దిగువ ఫోటోలో మ‌నం చూడ‌వ‌చ్చు) కాలేయంలోప‌ల పేరుకొని పోయిన క‌ణితి ప్ర‌మాద‌క‌రంగా మారిపోయింది. అక్క‌డ నుంచి దాన్ని తొల‌గించ‌క పోతే ఆయ‌న‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. అలాగ‌ని తొంద‌ర‌ప‌డి తొల‌గించే ప‌రిస్థితి కూడా కాదు. అందుకే ఆయ‌న‌కు హెప‌టెక్ట‌మీ ఆప‌రేష‌న్ చేయాల‌ని నిర్ణ‌యించాం. దాదాపు 3 గంట‌ల పాటు సంక్లిష్ట‌మైన ఆప‌రేష‌న్ చేసి క‌ణితిని తొల‌గించ‌టం జ‌రిగింది. దీంతో ఆయ‌న‌కు పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.
ఈ కేసు విష‌యంలో కూడా ముందు జాగ్ర‌త్త యొక్క ప్రాధాన్యం తెలిసి వ‌చ్చింది. క‌ణితి ప్రారంభ కాలంలోనే గ‌మ‌నించి ఉంటే ఇంత‌టి రిస్క్ తో ఆప‌రేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు. అదే స‌మ‌యంలో కనీసం అప్పుడైనా గుర్తించాం కాబ‌ట్టి స‌రిపోయింది లేక‌పోతే చాలా చాలా ఇబ్బంది ఏర్ప‌డేది.