...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

అన్నం తినకపోవడం.. దీర్ఘకాలిక వ్యాధి

వ్యక్తిగత అలవాట్లను బట్టి జీవితాంతం వెంటాడే సమస్య గ్యాస్ ట్రబుల్. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీన్నేగ్యాస్ట్రైటిస్ అని కూడా అంటారు. గ్యాస్ట్రైటిస్ లో పేగుల్లోపలి పొరలు వాచిపోతాయి. అన్నం సహించకపోవడం, ఆకలి లేకపోవడం, వికారం, విరోచనాలు వంటివి గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. సాయంకాలం కంటే పొద్దున పూటే ఈ బాథలు ఎక్కువగా ఉంటాయి. పేగుపై పూత అంటే గ్సాస్ట్రిక్ అల్సర్ ఉన్నా కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. ప్యాంక్రియాజ్ క్యాన్సర్ వచ్చినప్పుడు, లివర్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
            రోజువారీ తినే అన్నమా కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఆ అన్నం తినే అలవాట్లను బట్టి కూడా దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలను అంచనా వేయొచ్చు. ఎప్పుడో ఓసారి అన్నం మానేస్తే పర్వాలేదు కానీ.. తరచుగా అన్నం తినాలని అనిపించకపోతే మాత్రం తప్పనిసరిగా అనునామనించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ అన్నం తినాలనిపించకపోవడం టీబీ, క్యాన్సర్, గ్యాస్ట్రైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

అన్నం సహించట్లేదా..?

అన్నం వాసన తెలియకపోవడం, అీన్నపు రుచి తెలియకపోవడం, ఆస్వాదించలేకపోవడం, ఒక రుచికి, మరో రుచికి తేడా తెలియక పోవడం, నోటిలోపల అసహ్యకరమైన ఏదో రుచి ఉండటం వంటివన్నీ.. అన్నం సహించట్లేదనడానికి సంకేతాలు. నోటి దుర్వాసన, మన ఊపిరి ఇతరులకు అసహ్యం కలిగిస్తుందనే భయంతో శ్వాస బిగపట్టడం కూడా దీని లక్షణాలే.
       రక్తహీనత కారణంగా రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోయి ఆ ప్రభావం ఎర్రరక్తకణాలతో పాటు జీర్ణకోశవ్యవస్థ మీద కూడా ఉంటుంది. దీని వల్ల ఆక్సిజన్ శరీరానికి అందడం తగ్గిపోయి జీవక్రియలో లోపాలు ఏర్పడతాయి. వీటితో పాటు మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. ఆకలి మందగించడం, వికారం, మలబద్ధకం వంటి వన్నీ రక్తహీనత లక్షణాలే. 

కడుపు మంటే.. పేగుపూత

మనకు చాలా కోపం వచ్చినప్పుడు తెలియన ఆందోళన, అసంతృప్తికి గురవుతాం. కొంతమందికి కోపం వస్తే వాళ్లేం చేస్తున్నారో కూడా వారికే తెలియదు. అనవసర ఆందోళన, అసంతృప్తి కోపంతో పాటు కడుపు మంటకు కూడా కారణమౌతాయి. కడుపుమంట దీర్ఘకాలం ఉంటే అది పుళ్లుగా ఏర్పడి.. పేగుపూతకు దారితీస్తుంది. నాలికపూస్తే ఎర్రగా అయి మంట పెట్టినట్లే.. పేగుల్లో యాసిడ్ ఎక్కువైతే ఎర్రగా మారి పొక్కిపోతాయి.
             పేగుపూత ఉన్నవారికి పొట్ట మీద చెయ్యి వేస్తే నొప్పిగా ఉంటుంది. కడపు లోపల్నుంచి విపరీతమైన నొప్పి ఉంటుంది. కొంతమందికి ఆహారం తీసుకుంటే నొప్పి పెరుగుతుంది.  భోజనం చేయగానే అనీజీగా ఉంటుంది. వికారం వాంతి వస్తున్నట్లు ఉంటుంది. భోజనం కాస్త ఆలస్యమైతే కడుపులో ఏదో అవుతున్నట్లుగా ఉంటుంది. కొంచెం తినగానే కడపు నిండటం, మళ్లీ వెంటనే ఆకలి వేయడం పేగుపూత లక్షణాలు. పేగుపూత లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.

బయటి తిళ్లతో జాగ్రత్త..!

బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో టైం పాస్ కోసం బయటి తిళ్లు తినడం మనలో చాలా మందికి ఉండే అలవాటు. అయితే మనం తీసుకునే ఆహారపదార్ధాలు శుభ్రంగా ఉన్నాయో.. లేదో చూసుకోకపోతే అవి గ్యాస్ట్రైటిస్ కు దారితీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 
1. సాధారణంగా రైలు, బస్సు ప్రయాణాల సమయంలో బయటి ఆహారపానీయాలు తీసుకుంటాం. వీటిలో చాలావరకు అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయబడతాయి. 
2. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు విందు భోజనంలో కూడా ఆహారం, పానీయాలు తినడం, తాగడం తప్పనిసరి. ఇక్కడ ఆహారం కూడా ఎంతో కొంత కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. 
3. హోటళ్లలో, హాస్టళ్లలో, మిర్చిబళ్ల దగ్గర తినే ఆహారం ఎక్కువశాతం కలుషితమై ఉంటుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. 
4. ఇంట్లో తాగే నీరు కూడా పంచాయతీ, మున్సిపాలిటీ సప్లై చేసే నీళ్లు ఎంతవరకు శుభ్రంగా ఉంటుందో చెప్పడం కష్టమే. కలుషిత నీరు తాగినా గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సుంది.  
5. గోళ్లల్లో ఉండే మట్టి కూడా తినే ఆహారం ద్వారా పేగుల్లోకి చేరి రోగాలకు దారితీస్తుంది.

వామ్మో కడుపునొప్పి..!

కడుపునొప్పి రాని మనిషంటూ ఉండడు. ఆమాటకొస్తే కడుపులోకి ఆహారం తీసుకునే సమస్త జంతువులు కడుపునొప్పికి మినహాయింపు కాదు. పేగుల లోపల అలజడి కలిగినప్పుడు కడుపు తరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. పేగుకు సంబంధించిన వ్యాధులతో పాటు లివర్ మరియి స్ప్లీన్ వ్యాధులు, పాంక్రియాజ్, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు , గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా పేగుల్లో అలజడికి కారణమౌతాయి.
      తరచూ ఆకలి మందగించడం, వాంతి, వికారం, కడుపులో బరువుగా ఉండటం, కడుపు నొప్పిగా ఉండం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. గ్యాస్ట్రయిటిస్ ఉందేమో పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. వాంతి అయినప్పుడు కొద్దిగా నెత్తుటి జీర కనిపించినా, నెత్తురు పడినా అది తప్పకుండా గ్యాస్ట్రయిటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. పొట్టలోపల సూక్ష్మజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ఈ గ్యాస్ట్రయిటిస్ రావడానికి ప్రధాన కారణం. 

ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రస్తుత ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎక్కువగా డబ్బు సంపాదించేవారు కాదు.. అందరికంటే ఆరోగ్యంగా ఉన్నవారే. కాలుష్యం పెరిగిపోతున్న నేటిరోజుల్లో.. జీవనశైలిలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వేగవంతమైన జీవనశైలితో ఆహారపు అలవాట్లు, నిద్ర సమయంలో కూడా తేడాలు ఉంటున్నాయి. ఈ తేడాలు ఓ పరిమితి దాటనంత వరకు ఓకే. కానీ ఏమాత్రం పరిమితి దాటినా మన అలవాట్లే రోగాలకు ఆహ్వానం పలికినట్లవుతుంది.
        ఎలాంటి జీవనశైలి ఉన్నవారికి అయినా సరిపోయే విధంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవచ్చు. కానీ అవి తప్పకుండా ఆరోగ్యకరమైన అలవాట్లయి ఉండాలి. మన జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయంలో మనం డాక్టర్ల సలహాలు తప్పక పాటించాలి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా.. తర్వాతి కాలంలో అదే పెద్ద జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మన ఆరోగ్య పరిరక్షణ మన ఆహారపు అలవాట్లలోనే ఉందన్న సంగతి గుర్తుంచుకోవాల్సిన అసరం ఉంది. 

త‌క్కువ ఖ‌ర్చుతో అధునాత‌న వైద్యం సాధ్య‌మేనా..!


అవును.. త‌క్కువ ఖ‌ర్చుతో అధునాత‌న వైద్యం సాధ్య‌మే అని నిరూపించారు డాక్ట‌ర్ రాఘ‌వేంద్రరావు. స‌ర్వేంద్రియాణాం అవ‌యవం ప్రధానం అనుకోవ‌చ్చు. ఎందుకంటే మాన‌వ శ‌రీరంలో అన్ని అవ‌యవాల‌కు ఆయా ప్రాధాన్యత ఉంటుంది. కానీ కొన్ని అవ‌య‌వాల విష‌యంలో మాత్రం ఎక్కువ ప్రధానం అనుకోవాలి. ఎందుకంటే ఈ అవ‌య‌వాలు..త‌మ ప‌నితీరులో విఫ‌లం అయితే, లేదా చెడిపోతే..ఇత‌ర అవ‌య‌వాలు ఏమీ వాటి ప‌నులు చ‌క్కబెట్టలేవు. అటువంటి కీల‌క అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. జ‌న‌గామ్ కు చెందిన విజ‌య్ కుమార్ విష‌యంలో అదే జ‌రిగింది. 
 వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గాం కు చెందిన విజ‌య్ కుమార్ కు కాలేయం చెడిపోయింది. మందులు, శ‌స్త్ర చికిత్సలు కూడా విఫ‌ల‌మైన ద‌శ కు కాలేయం చేరుకొంది. ఈ ద‌శ‌లో నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాలజీ (సాయివాణి సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి)ని సంప్రదించ‌టం జ‌రిగింది. హాస్పిట‌ల్ లోని స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు అండ్ లివ‌ర్ ట్రాన్సుప్లాంట్ స‌ర్జన్ డాక్టర్ ఆర్ వీ రాఘ‌వేంద్రరావు  పేషంట్ ను ప‌రిశీలించి, కాలేయ మార్పిడి ద్వారానే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిర్ధారించారు. ద‌క్షిణ కొరియాలో కాలేయ మార్పిడిలో శిక్షణ పొంది, అనేక మందికి విజ‌య‌వంతంగా కాలేయ మార్పిడి చేసిన డాక్టర్ ఆర్ వీ రాఘ‌వేంద్రరావు ఇందుకు గ‌ల మార్గాల్ని అన్వేషించారు. 
ఈలోగా జూన్ 22న జీవ‌న్ ధాన్ ప‌థ‌కం ద్వారా విజ‌య‌వాడ‌లో ఒక యువ‌కుడు బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు స‌మాచారం అందింది. అప్పుడు డాక్టర్ రాఘ‌వేంద్ర రావు బృందం అప్పటిక‌ప్పుడు విజ‌య‌వాడ బ‌య‌లు దేరింది. అక్కడ పిన్నమ‌నేని వైద్య క‌ళాశాల ఆసుప‌త్రి లో బ్రెయిన్ డెడ్ అయిన పి. నాగ‌బాబు నుంచి కాలేయాన్ని శ‌స్త్ర చికిత్స ద్వారా వేరు చేసి, అప్పటిక‌ప్పుడు  విమానంలో   హైద‌రాబాద్‌కు తీసుకొని వ‌చ్చారు. దాన్ని 12 గంట‌ల్లోగా గ్రహీత శ‌రీరంలో అమ‌ర్చాలి. అందుకే ఆ 8-9గంట‌ల పాటు స‌ర్జరీ చేసి ఈ కాలేయాన్ని విజ‌య వంతంగా రోగి శ‌రీరంలో అమ‌ర్చటం జ‌రిగింది.
వారం రోజులు ఐసీయూలో ఉంచి అబ్జర్వ్ చేసిన త‌ర్వాత సాధార‌ణ వార్డుకి మార్చటం జ‌రిగింది. పేషంట్ పూర్తిగా కోలుకోవ‌టంతో డిశ్చార్జ్ చేయాల‌ని నిర్ణయించారు.

ఈ సంద‌ర్బంగా నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాలజీ (సాయివాణి సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి) డైర‌క్టర్ రాఘవేంద్రరావు పాత్రికేయుల‌తో మాట్లాడుతూ.. త‌క్కువ ఖ‌ర్చుతో మెరుగైన చికిత్స అందించ‌టం ల‌క్ష్యంగా త‌మ సంస్థ ప‌నిచేస్తోందని వివ‌రించారు. అధునాతన టెక్నాల‌జీ ఉప‌యోగించి, నిపుణులైన వైద్యుల‌తో సంక్లిష్టమైన ఆప‌రేష‌న్ లు సైతం విజ‌య‌వంతంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ కు ఇత‌ర కార్పొరేట్ సంస్థల‌తో పోలిస్తే స‌గం ధ‌ర‌కే తాము చేయ‌గ‌లిగామ‌ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా పేషంట్ విజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. త‌మ‌కు చికిత్స అందించిన డాక్టర్ రాఘ‌వేంద్రరావు, బృందానికి కృత‌జ్ఞత‌లు తెలిపారు.