...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

అమీబియాసిస్ కు అరవై కారణాలు

మన జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోనప్పుడు అమీబియాసిస్ వచ్చే అవకాశం ఉంది. నోటి ద్వారా కడుపులోకి తీసుకునే ఆహారం కారణంగానే ఈ వ్యాధి వస్తుంది. సహజంగా కలరాకు దారితీసే లక్షణాలన్నీ అమీబియాియాసిస్ కు దారితీస్తాయి. తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవడం ద్వారా అమీబియాసిస్ ను నియంత్రించవచ్చు.

                 పొగత్రాగడం, ఆల్కహాల్ సేవనం, గుట్కాలు, జర్దాలు, అమీబియాసిస్ ను మరింత పెంచుతాయి. పైగా కడుపులో అల్సర్లు రావడానికి కారణమౌతాయి.అమీబియాసిస్ లో పేగులు బాగా దెబ్బతింటాయి. దీని వల్ల దీర్ఘకాలం పాటు తిన్న ఆహారం జీర్ణం కాకుండా అలాగే ఉండిపోయి, సూక్ష్మజీవులకు నివాసస్థానంగా మారుతుంది. సూక్ష్మజీవులు పెరిగేకొద్దీ వ్యాధి తీవ్రత బాగా పెరుగుతుంది. 

కలరా వస్తే కలవరపడొద్దు

సాధారణంగా విరేచనాలు అవుతున్నాయని రోగులు డాక్టర్లకు చెబుతుంటారు. అయితే అన్ని విరేచనాలు ఒకేలా ఉండవు. అవి ఎప్పట్నుంచి అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి. విరేచనాల రంగు, వాసన ఎలా ఉందనే విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. వీటిని బట్టే డాక్టర్లు రోగికి చికిత్స విధానాన్ని నిర్ణయించగలుగుతారు. విరేచనాలకు ముందు రోగి ఏం తిన్నాడు, ఏ సమయంలో తిన్నాడనేది కూడా కలరా అవునో, కాదో నిర్థారించుకోవడానికి సహాయపడుతుంది.

                     కేవలం విరేచనాలు తగ్గించడానికి మందులివ్వడానికి ముందే.. రోగి గుండెపోటు, రక్తప్రసరణ సరిగ్గా ఉందో లేదో డాక్టర్లు అంచనా వేస్తారు. విరేచనాలు ఎలా అవుతున్నాయనే విషయాన్ని బట్టి.. అది కేవలం విరేచనాలో కాదో నిర్థారణకు వస్తారు. విరేచనాలతో పాటూ మూత్రం పడుతుంటే చాలా అపాయకరమైన పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. ఇక మూత్రం అయిన తర్వాత కూడా విరేచనాలు ఆగకపోతే అది మరింత ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచచ్చు. కలరా వచ్చినప్పుడు కలవరపడకుండా డాక్టర్ని సకాలంలో సంప్రదించడం ఉత్తమం.

అజీర్తే విరేచనాలకు మూలం

స్ప్రూ అనే విరేచనాల వ్యాధిలో అమిత దుర్వాసన ఉంటుంది. దీర్ఘకాలం విరేచనాలు ఉండటం వల్ల రోగి బరువు కోల్పోతాడు. ఇనుము వంటి పోషక పదార్ధాలు ఒంటికి వంటబట్టకపోవడంతో రోగి క్షీణించి పాలిపోతాడు. పాలు, గుడ్లు వంటివి సరిపడని శరీర తత్వం ఉన్న వ్యక్తులు జీర్ణశక్తి బాగా తక్కువగా ఉన్నప్పుడు అవి తీసుకుంటే.. తీవ్రమైన ఎలర్జీ లక్షణాలు వచ్చి విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

                         పేగులోపల విపరీతంగా పూసి పుళ్లు పడిపోయినప్పుడు అల్సరేటివ్ కోవైటిస్ అంటారు. రక్తంతో కూడిన విరేచనం, కడుపులో నొప్పి, జ్వరం ఉంటున్నప్పుడు పేగుల్లో ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని గమనించాలి. ఎపెండిసైడిటిస్ అనే కడుపు నొప్పితో కుడివైపుగజ్జల్లో నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లివర్ జబ్బుతో బాథపడే వ్యక్తికి కుడివైపు డొక్కల్లో నొప్పి వస్తుంది. పేగుల్లో ఏర్పడే తేడాల వల్ల విరేచనాలు, కడుపు నొప్పి వస్తాయి. 

కలరాతో జాగ్రత్త..!

ఆహారం ద్వారా, నీటిద్వారా కడుపులోకి చేరే హానికారక బ్యాక్టీరియా కారణంగా కలరా వస్తుంది. ఈ బ్యాక్టీరియా విరేచనాల వ్యాధికి కారణం అవుతాయి. కలరా ఊరంతా వ్యాపించినప్పుడు అతిసారం అంటారు. ఊళ్లో కలరా కేసులు ఉన్నాయని తెలిసినప్పుడు తక్కిన జనాభా అంతా కలరా వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. మానసిక వ్యాధులు, నాడీ సంబంధ వ్యాధులు కూడా ఈ వ్యాధి రావడానికి కారణం అవుతాయి.

        అమీబిక్ డిసెంట్రీ వంటి వ్యాధులు, పేగుల్లో టీబీ సూక్ష్మజీవుల వల్ల ఏ్పడే విరేచనాల వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశం ఉంది. జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి రావచ్చు. శరీరానికి సరిపడని ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి స్థితి వస్తుంది. పేగుపూత, క్రిమిసంహారకాలు పొరపాటున ఆహారం ద్వారా కడుపులోకి వెళ్లడం వల్ల కూడా కలరా వస్తుంది. 

ఎసిడిటీకి కారణాలెన్నో..!

కడుపులో మంటకు ఎసిడిటీయే కారణమని మనందరికీ తెలుసు. అతిగా ఆహారం తీసుకున్నా.. తీసుకోవాల్సినంత ఆహారం తినకపోయినా ఎసిటిడీ వస్తుంది. కాబట్టి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ప్రధానం. కడపులో మంట కారణంగా పనిచేయగల శక్తి తగ్గిపోతుంది. పుల్లటి తేన్పులు వస్తాయి. నోరు చేదుగా ఉంటుంది. పొట్ట బరువెక్కినట్లవుతుంది. కడపులో ఏదో ఉండ చుట్టినట్లు అనిపిస్తుంది.

                    గొంతులో, గుండెలో మంటగా అనిపిస్తుంది. అన్నం సహించదు. మలబద్ధకంతో పాటు మలం పచ్చగా మారుతుంది. విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఒక్కోసారి ఆ నొప్పి తగ్గడానికి  మందులు  మింగడం వల్ల మరింత ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది.  వికారంగా ఉంటుంది. గుండెల్లో, ఛాతిలో నొప్పి వచ్చి గుండెపోటు వస్తుందేమోనన్న భయం కలుగుతుంది. భయం కారణంగా అలసట, కడపులో గడబిడ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. 

కడుపు డస్ట్ బిన్ చేయొద్దు

మనకు వచ్చే వ్యాధుల్లో చాలావరకు తినే ఆహారం వల్లే వస్తాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కడుపులోకి తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటే.. మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని పెద్దలు చెబుతారు. శుభ్రత లేని ఆహారం తింటే వ్యాధులు చుట్టబెడతాయి. ముందుగా కడుపు ఉబ్బరంతో మొదలైన వ్యాధులు ముప్పేట దాడి చేస్తాయి. కడుపు ఉబ్బరానికి ఆరోజు తిన్న ఆహారమే కారణం కాదు.. కొన్నిరోజులుగా అశుభ్రమైన ఆహారం తినడమే అసలు కారణం.
     మనం బయట తినే తిళ్లను కడుపు అరాయించుకోలేకపోతే.. అవి లోపలే పేరుకుని కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయి. కడుపు ఉబ్బరం పెరిగి మలబద్ధకంగా మారుతుంది. కాబట్టి తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హోటల్ ఫుడ్, చిరుతిళ్లు తినేముందు అవి ఎలాంటి వాతావరణంలో తయారుచేస్తాయో గమనించడం చాలా ముఖ్యం. లేకపోతే మనం తినే చిన్నమొత్తం ఆహారం.. పెద్దమొత్తంలో అనారోగ్యానికి కారణమౌతుంది. కాబట్టి బయట చిరుతిళ్లు తినేవారూ పారాహుషార్. 

కడుపు మంట - అజీర్తి

ఒక్కోసారి విపరీతమైన ఆకలి వేస్తుంది. వడ్డించింది సరిపోదేమో అనిపిస్తుంది. కానీ కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకో ముద్ద తిందామంటే  పొట్ట బరువెక్కిపోతుంది. ఇంక మెతుకు కూడా దిగని పరిస్థితి వస్తుంది. సరే అని చెయ్యి కడుక్కుంటే.. మళ్లీ కాసేపటికే ఆకలి వేస్తుంది. తట్టుకోలేక ఏది కనిపిస్తే అది తినేద్దాం అనిపిస్తుంది. ఇదే అజీర్తి కథ.
           ఇప్పటిదాకా వేసింది నిజమైన ఆకలి కాదు. మాయా ఆకలి. అది కడుపులో మంట. కడుపులోకి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అలాగే ఉండిపోవడం వల్ల అజీర్తి చేస్తుంది. ఆహార పదార్థాల ఆమ్లీకరణ తర్వాత చిన్నపేగుల్లో శోషణ జరుగుతుంది. తర్వాత పెద్దపేగుల ద్వారా మూత్రపిండాల్లోకి వ్యర్థపదార్థాలు చేరతాయి. అయితే శోషణ సరిగా జరగకపోతే అజీర్తి వస్తుంది.