...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

కాలేయ మార్పిడి - అవ‌గాహ‌న‌


కాలేయ మార్పిడి అంటే చాలామందికి పూర్తి వివ‌రాలు తెలియ‌దు. వివిధ కార‌ణాల‌తో కాలేయం పూర్తిగా చెడిపోయిన‌ప్పుడు దానికి ప్ర‌త్యామ్నాయం అనుస‌రించాల్సి ఉంటుంది. అటువంట‌ప్పుడు పూర్తి స్థాయి ఆరోగ్య‌వంతుడు లేదా బ్రెయిన్ డెడ్ అయిన ఆరోగ్య వంతుడి శ‌రీరం నుంచి కాలేయ భాగాన్ని తీసి, రోగి శ‌రీరంలో అమ‌ర్చ‌టాన్నే కాలేయ మార్పిడి అంటారు.
దాత నుంచి కాలేయాన్ని సేక‌రించాక గ్ర‌హీత లోకి అమ‌ర్చ‌టం అన్న‌ది నిపుణులైన వైద్యుల టీమ్ మాత్ర‌మే చేయ‌గ‌లుగుతుంది. ట్రాన్సు ప్లాంటేష‌న్ స‌ర్జ‌న్‌, అనెస్థ‌టిస్టు, పెర్ ఫ్యుష‌నిస్టు, హెప‌టాల‌జిస్టు వంటి నిపుణులు ఇందులో పాలు పంచుకొంటారు. కాలేయ మార్పిడి లో వివిధ విభాగాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అవ‌స‌రం. అదే స‌మ‌యంలో స‌ద‌రు ఆస్ప‌త్రిలో అన్ని వ‌స‌తులు ఉన్న ఆప‌రేష‌న్ థియోట‌ర్‌, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, బ్ల‌డ్ బ్యాంక్, స‌పోర్టివ్ ల్యాబ్ లు ఉండాలి. సుశిక్షితులైన సిబ్బంది ఉండాలి. వీట‌న్నింటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఆలోచిస్తే కాలేయ మార్పిడి ఒక ఖ‌రీదైన అంశంగా చెబుతారు. కానీ భార‌త్ లో మాత్రం ఇది చౌక‌గా జ‌రుగుతుంద‌నే  చెప్పాలి.
కాలేయాన్ని గ్ర‌హీత శ‌రీరంలో అమ‌ర్చాక‌.. అది అక్క‌డ నెమ్మ‌దిగా ఇమిడిపోతుంది. ఇత‌ర అవ‌య‌వాల నుంచి సహాయం తీసుకొని కుదురుకొంటుంది. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా త‌న విధులు నిర్వ‌ర్తించ‌టం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. సాధారణంగా శ‌రీరంలోకి ఇత‌రుల అవ‌య‌వాలు ప్ర‌వేశిస్తే.. దేహం దాన్ని తిర‌స్క‌రిస్తుంది. ఇటువంటి ప‌రిస్థితి చోటుచేసుకోకుండా ఉండేందుకు ఇమ్యునో స‌ప్రెసివ్ మందులు వాడాల్సి ఉంటుంది. త‌క్కువ ఇమ్యూనోజెనిక్ సామ‌ర్థ్యం క‌ల అవ‌య‌వంగా కాలేయాన్ని చెబుతారు. అందుచేత ఎక్కువ కాలం ఈ మందుల్ని వాడుతున్నా..చౌక‌గానే సాధ్యం అని గుర్తించుకోవాలి. ఇటువంటి ఆప‌రేష‌న్ ల‌లో త‌ర‌చుగా వ‌చ్చే సైడ్ ఎఫెక్టు గా ఇన్ ఫెక్ష‌న్ ను చెబుతారు. అందుచేత కాలేయ మార్పిడికి ముందుగానే వైర‌ల్‌, బ్యాక్టీరియా ఇన్ ఫెక్ష‌న్ సోక‌కుండా టీకాల్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ లు విజ‌య‌వంతం అవుతున్న‌ట్లుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇటువంటి రోగులు ..మిగిలిన రోజుల్లో అవ‌స‌రం అయిన‌ప్పుడ‌ల్లా వైద్యుల సాయం తీసుకోవాలి.
చేతుల్ని శుభ్రపరుచుకోవటం ఎలా.. ఉపయోగాలు ఏమిటో తెలుసా..!

అర చేతుల్ని తరుచూ శుభ్రం చేసుకోవటం చాలా ముఖ్యం. సబ్బుతో కానీ, శానిటైజర్‌ తో కానీ శుభ్రం చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి.

వాస్తవానికి చేతులు శుభ్రం చేసుకోవటం మీద మెడికల్ పరిశోధనలు జరిగాయి. మొదటగా చేతుల్ని నీటితో తడి చేసుకోవాలి. తరువాత సబ్బు బాగా పట్టించాలి. అప్పుడు రెండు చేతుల్ని బాగా రుద్దుకోవాలి. తర్వాత కొద్దిగా నీటిని పోసుకొని బాగా నురుగు వచ్చేలా రుద్దుకోవాలి. ముఖ్యంగా వేళ్ల చివరల్లో, అర చేతుల్లో బాగా రుద్దుకోవాలి. తరువాత నురుగు మొత్తం వదిలేట్లుగా నీటితో కడిగేసుకోవాలి. తరువాత శుభ్రమైన పొడి గుడ్డతో తుడుచుకోవాలి.

చేతుల్ని ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలంటే...
1) భోజనానికి ముందు
2) మల విసర్జన తరువాత
3) వంట చేసేటప్పుడు
4) పిల్లలకు డైపర్‌ మార్చినప్పుడు
5) రోగులకు సపర్యలు చేసినప్పుడు

చేతుల్ని శుభ్రం చేసుకోవటం వల్ల ప్రయోజనాలు...
అర చేతుల్ని వందల సంఖ్యలో సూక్ష్మ జీవులు ఆశ్రయించుకొని ఉంటాయి. వీటిని సబ్బుతో రుద్దటం ద్వారా వదిలించుకొనేందుకు వీలవుతుంది. అప్పుడు వివిధ పనులు చేసుకొన్నప్పుడు ఆరోగ్యకరంగా సాగించగలుగుతాం. 

చరిత్ర లో ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది తెలుసా..!

హెపటైటిస్‌ డే 2017..! 
ప్రపంచ ఆరోగ్య సంస్థ జూలై 28 న హెపటైటిస్‌ డే గా ప్రకటించటం జరిగింది. హెపటైటిస్‌ ను తరిమి కొట్టేందుకు అవగాహన కల్పించాలని పిలుపు ఇచ్చింది. ప్రమాద కరమైన సమస్యల్లో ఒకటిగా గుర్తించి అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. 

ఇందులో ఐదుర‌కాల వైర‌స్ ల‌ను గుర్తించ‌వ‌చ్చు. హెప‌టైటిస్ ఏబీసీడీఈ అనే వైర‌స్ ల కార‌ణంగాకామెర్లు సోకుతాయి. వీటిలో హెప‌టైటిస్ ఏఈ అనే వైర‌స్ లు క‌లుషిత ఆహారంక‌లుషిత నీటి ద్వారా ఒక‌రి నుంచి ఒక‌రికి సోకుతాయి. ఎక్కువ‌మంది లో ఈ వైర‌స్ ఎక్కువగా హాని క‌ల్గించ‌క పోవ‌చ్చు. హెప‌టైటిస్ బీసీ అనే వైర‌స్ లు మాత్రం క‌లుషిత లాలాజ‌లంక‌లుషిత ర‌క్తంక‌లుషిత వీర్యం ద్వారా ఒక‌రి నుంచి ఒక‌రికి సంక్రమిస్తుంది. ఈ వైర‌స్ లు మాత్రం కాలేయానికి తీవ్రమైన హాని క‌ల్గిస్తాయి.
సుదీర్ఘకాలం పాటు ఆల్కహాల్ ను ఎక్కువ‌గా తీసుకొంటుంటే కాలేయ పాడ‌వ‌టం ఖాయం.మొద‌ట్లో కాలేయ క‌ణాల స్థానంలో కొవ్వుక‌ణాలు పోగుప‌డి త‌ర్వాత కాలంలో ఇవే స్థిర‌ప‌డ‌తాయి. వాస్తవానికి మ‌ద్యం ఎంత వ‌ర‌కు తాగ‌వ‌చ్చు అనే ప‌రిమితి చెప్పటం క‌ష్టం. ఇది ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉండ‌వ‌చ్చు. అందుచేత మ‌ద్యం తాగ‌టం అనేది హానిక‌రం అని గుర్తుంచుకోవాలి. 
సమస్య తొలుత దశలో మందులతో పరిష్కారం సాధ్యం అవుతుంది. ముదిరిన దశలో మాత్రం  ఆపరేషన్‌ విధానాలు అవసరం అవుతాయి. 
ఆరోగ్యకరమైన అలవాట్లు, సక్రమమైన జీవన శైలిని పాటించటం ద్వారా ఈ సమస్యను అరికట్ట వచ్చు. 

కాలేయ సంరక్షణ మన చేతుల్లోనే ఉంది తెలుసా..!

సాధారణంగా ఆరోగ్య పరిరక్షణ మన చేతుల్లోనే ఉందని మనందరికీ తెలుసు. ముఖ్యంగా శరీరంలో అనేక ముఖ్య విధుల్నినిర్వర్తించే కాలేయ పరిరక్షణ కూడా మన అలవాట్లతో నిర్దేశించుకోవచ్చు.

కాలేయం అన్నది జీర్ణ వ్యవస్థ తో పాటు అనేక ముఖ్య వ్యవస్థలతో అనుసంధానం అయి ఉంటుంది. అయితే తీసుకొనే ఆహారంలోని కొవ్వు పదార్థాలు కాలేయాన్ని చేరటం సహజం. ఈ క్రమంలో చెడు అలవాట్లకు బానిస అయితే అటువంటి పదార్థాలు కూడా కాలేయాన్ని చేరిపోతాయి. ముఖ్యంగా మద్యానికి బానిస అయిన వారిని చూసినప్పుడు అందులోని విష పదార్థాలు ఎక్కువగా కాలేయంలోనే పోగు పడతాయి. అందుచేత అంతిమంగా కాలేయం పాడవటం చూస్తుంటాం.

అందుచేత చెడు అలవాట్లకు ముఖ్యంగా మద్యపాానానికి దూరంగా ఉంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఇటువంటి విషయాలు జాగ్రత్తగా గమనించుకోవం మేలు. 
కాలేయ మార్పిడి..అవ‌గాహ‌న‌
జీర్ణ వ్య‌వ‌స్థ లో కాలేయం ఒక ముఖ్య‌మైన అవ‌య‌వం. జీర్ణాశ‌యానికి కుడివైపున ఇది అమ‌రి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయ‌టంలో కీల‌క‌పాత్ర పోషించ‌టంతో పాటు ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, ఔష‌ద వినియోగం, మ‌లినాల విస‌ర్జ‌న వంటి అనేక జీవ‌న క్రియ‌ల్లో ఉప‌యోగ‌ప‌డుతుంది.
అనేక సార్లు కాలేయం చెడిపోవటంతో దాన్ని పూర్తిగా మార్చాల్సి వస్తోంది. అందుచేత కాలేయాన్ని సేకరించి అమర్చాల్సి ఉంటుంది. దీన్ని కాలేయ మార్పిడి అంటారు. 

కాలేయాన్ని గ్ర‌హీత శ‌రీరంలో అమ‌ర్చాక‌.. అది అక్క‌డ నెమ్మ‌దిగా ఇమిడిపోతుంది. ఇత‌ర అవ‌య‌వాల నుంచి సహాయం తీసుకొని కుదురుకొంటుంది. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా త‌న విధులు నిర్వ‌ర్తించ‌టం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. సాధారణంగా శ‌రీరంలోకి ఇత‌రుల అవ‌య‌వాలు ప్ర‌వేశిస్తే.. దేహం దాన్ని తిర‌స్క‌రిస్తుంది. ఇటువంటి ప‌రిస్థితి చోటుచేసుకోకుండా ఉండేందుకు ఇమ్యునో స‌ప్రెసివ్ మందులు వాడాల్సి ఉంటుంది. త‌క్కువ ఇమ్యూనోజెనిక్ సామ‌ర్థ్యం క‌ల అవ‌య‌వంగా కాలేయాన్ని చెబుతారు. అందుచేత ఎక్కువ కాలం ఈ మందుల్ని వాడుతున్నా..చౌక‌గానే సాధ్యం అని గుర్తించుకోవాలి. ఇటువంటి ఆప‌రేష‌న్ ల‌లో త‌ర‌చుగా వ‌చ్చే సైడ్ ఎఫెక్టు గా ఇన్ ఫెక్ష‌న్ ను చెబుతారు. అందుచేత కాలేయ మార్పిడికి ముందుగానే వైర‌ల్‌, బ్యాక్టీరియా ఇన్ ఫెక్ష‌న్ సోక‌కుండా టీకాల్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ లు విజ‌య‌వంతం అవుతున్న‌ట్లుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇటువంటి రోగులు ..మిగిలిన రోజుల్లో అవ‌స‌రం అయిన‌ప్పుడ‌ల్లా వైద్యుల సాయం తీసుకోవాలి.
మొత్తం మీద కాలేయ మార్పిడికి సంబంధించిన అవ‌గాహ‌న స‌మాజంలో బాగా పెర‌గాల్సి ఉంటుంది. కాలేయ వ్యాధుల చికిత్స‌లో అనేక మెడిక‌ల్‌, స‌ర్జిక‌ల్ విధానాలు ఉన్నాయ‌ని గుర్తించాలి. వీటిలో కాలేయ మార్పిడి కీల‌క‌మైంద‌ని తెలుసుకోవాలి. దీనిప‌ట్ల అపోహ‌లు తొల‌గించాల్సి ఉంది. మ‌ర‌ణం త‌ర్వాత అవ‌య‌వాలు దానం చేసే క‌ల్చ‌ర్ పెర‌గాలి. ఇందుకు స్వ‌చ్ఛందంగా ముందుకు రావాలి. అదే స‌మ‌యంలో స‌రైన చ‌ట్టాలు చేయ‌టం ద్వారా ప్ర‌భుత్వాలు కూడా అనుమతించాలి. సుదీర్ఘ రోగాల్ని న‌యం చేసే క్ర‌మంలో అవ‌య‌వ మార్పిడి అనేది ఒక స‌మర్థ‌వంత మైన విధానంగా ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలి.

ఈ సమయంలో కాస్త రాళ్లు వెనకేసుకొంటే కొంప మునుగుతుంది.

ఆధునిక కాలంలో అనేక అంశాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా జీవన శైలి బాగా మారుతోంది. కూర్చొన్న చోట నుంచి కదలకుండానే అన్నీ అమరిపోతుండటం చాాలా మార్పుల్ని తెచ్చిపెడుతోంది. అందులో ఏర్పడిన ముఖ్య సమస్యే ఇది.

జీర్ణ వ్యవస్థలో రాళ్లు ఏర్పడతాయి అంటే చాలామందికి అతిశయోక్తిగా అనిపిస్తుంది. కానీ, అనేక సంద‌ర్భాల్లో జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని కొన్ని భాగాల్లో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. ఇటువంటి సంద‌ర్బాల్లో కూడా క‌డుపు నొప్పి వంటి అనేక స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతుంటాయి. ఈ స‌మ‌స్య‌ను శాస్త్రీయంగా గుర్తించి చికిత్స అందిస్తేనే రోగికి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ లో కాలేయం నుంచి విడుద‌ల అయ్యే పైత్య ర‌సం(బైల్ జ్యూస్) లో బైలి రూబిన్‌, బైలి విరిడిన్ అనే వ‌ర్ణ‌కాలు ఉంటాయి. ఇవి పేరుకొని పోయిన‌ప్పుడు లేక కొలెస్ట‌రాల్ నిలిచి పోయిన‌ప్పుడు ఈ ద్రవ ప‌దార్థాలు గ‌ట్టి ప‌డి రాళ్లుగా మార‌తాయి. ఈ రాళ్లు కొలెస్ట‌రాల్ కార‌ణంగా ఏర్ప‌డితే ప‌సుపు, ఆకుప‌చ్చ రంగుల్లో, బైలిరూబిన్ కార‌ణంగా ఏర్ప‌డితే బూడిద రంగులో ఉండ‌వ‌చ్చు. వీటితో పాటు మ‌ద్యం ఎక్కువ‌గా తాగ‌టం కార‌ణంగా లేక క్రిముల ఇన్ ఫెక్ష‌న్ కారణంగా కూడా రాళ్లు ఏర్ప‌డ‌వ‌చ్చు.

సాధార‌ణంగా కాలేయం నుంచి విడుద‌ల అయిన పైత్య‌ర‌సం (బైల్ జ్యూస్‌) బైల్ గొట్టాలు అనే నాళాల ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఈ క్ర‌మంలో గాల్ బ్లాడ‌ర్ అనే చిన్న‌సంచీలో తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. ఆ త‌ర్వాత పేగులో ప్ర‌వేశిస్తుంది. బైల్ జ్యూస్ ప్ర‌వ‌హించే ఈ మార్గాల్లో ఎక్క‌డైనా రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అంటే బైల్ గొట్టాల్లో కానీ, గాల్ బ్లాడ‌ర్ లో కానీ చూడ‌వ‌చ్చు. కొన్ని సందర్బాల్లో కాలేయంలోనే రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. వీటితో పాటు జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని మ‌రో అనుబంధ గ్రంథి అయిన పాన్ క్రియాస్ లో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. క్రానిక్ పాన్ క్రియాటైటిస్ తో బాద‌ప‌డుతున్న‌ప్పుడు ఇలా జ‌రుగుతుంటుంది. కాల్సియం వంటి ల‌వ‌ణాలు బాగా పేరుకొని పోయిన‌ప్పుడు రాళ్లు ఏర్ప‌డ‌తాయి. చిన్న వయస్సులో కూడా ముఖ్యంగా పాన్‌ క్రియాస్‌ గ్రంథిలో కొన్ని రకాల ఆహార లోపాల మూలంగా కానీ, కొన్ని జన్యుపరమైన మార్పుల మూలంగా కానీ రాళ్లు ఏర్పడవచ్చు. దీనిని ట్రాపికల్‌ పాన్‌ క్రియాటైటిస్ అని పిలుస్తారు.
స‌రైన జీవ‌న‌శైలి లేక‌పోవ‌టం, ముఖ్యంగా ఆహార నియ‌మాలు పాటించ‌క పోవ‌టం, మ‌ద్య‌పానం వంటి దుర‌ల‌వాట్లు ఈ రాళ్లు ఏర్ప‌డ‌టానికి కార‌ణం అవుతుంటాయి. కొవ్వులు ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవ‌టం లేక ఊబ‌కాయం కార‌ణంగా శ‌రీరంలో కొలెస్ట‌రాల్ ఎక్కువ అవ‌టంతో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. బ‌రువు త‌గ్గిపోతున్న సంద‌ర్భంలో కూడా ఇదే ప‌రిస్థితి త‌లెత్తుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌లో స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు, క్రిముల కార‌ణంగా ఇన్ ఫెక్ష‌న్ ఏర్ప‌డినా కూడా రాళ్లు ఏర్ప‌డ‌వ‌చ్చు. పెద్దవారిలో రాళ్లు ఏర్ప‌డితే త‌ర్వాత త‌రంలో కూడా ఈ స‌మ‌స్య ఏర్ప‌డ‌టానికి అవ‌కాశం ఉంటుంది. మ‌ధుమేహ రోగుల‌కు ఈ ప్ర‌మాదం కాస్త ఎక్కువ అని చెప్ప‌వ‌చ్చు.
అందుచేత రాళ్లు చేరినప్పుడు అలాగే వదిలేయటం సరికాదు. సరైన వైద్య చికిత్స చేయించుకోవటం మేలు. 

కాలేయ సంరక్షణ.. మీ చేతుల్లో..!

మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం కాలేయం. దాదాపు 500 కు పైగా జీవన క్రియల్లో ఇది  పాలు పంచుకొంటుంది. ప్రధానంగా జీర్ణ వ్యవకస్థలో చురుకైన పాత్ర పోషిస్తుంది.
అయితే కాలేయాన్ని సంరక్షించుకోవటం అన్నది మన చేతుల్లోనే ఉన్నది. ముఖ్యంగా ఆహార నియమాలు, అంతకు మించి ఆరోగ్యకరమైన అలవాట్లు అని గుర్తించుకోవాలి.


ఆధునిక కాలంలో మద్యం తాగటం అన్నది ఫ్యాషన్ గా మారుతోంది. ఈ తాగుడుకి బానిస అయినవారిలో విష పదార్థాలు పోగు పడతాయి. ఇవి క్రమంగా కాలేయాన్ని చేరి అక్కడ తిష్ట వేస్తాయి. పేరుకు తగినట్లుగానే ఈ చెడు పదార్థాలు క్రమ క్రమంగా సజీవ కణజాలాన్ని తినేస్తుంటాయి. దీంతో కాలేయం పాడై పోయి సిర్రోసిస్ లేదా క్యాన్సర్ వంటి పరిస్థితికి దారి తీస్తుంది.

అందుకే కాలేయాన్ని సంరక్షించుకోవటంలో ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రధానం అని గుర్తించుకోవాలి. మద్యం తాగటం అన్నది ఎప్పటికైనా ప్రమాదకరమైన అలవాటుగా భావించాలి. అందుచేత మద్యం కు దూరంగా ఉండటం మేలు. అంతే గాకుండా భారత్ వంటి సాంప్రదాయిక సమాాజాల్లో కుటుంబంలోని పెద్దలు ఏ పనిచేస్తుంటే, పిల్లలు వాటిని అనుసరిస్తుంటారు. అందుచేత పెద్దలకు మద్యం తాగే అలవాటు ఉంటే అది  క్రమంగా పిల్లలకు సంక్రమిస్తుంది. దీంతో తర తరాలుగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. 

మన ఆరోగ్యం మన చేతిలో.. !

వినటానికి కొంత అతిశయోక్తి లా ఉన్నా..ఇది నూటికి నూరుపాళ్లు నిజం. మన ఆరోగ్యాన్ని కాపాడుకొనే శక్తి మనకే ఉంది. ఇందుకు చేయాల్సింది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం. ఉదాహరణకు మన కెరీర్ లో కానీ, పని తీరులో కానీ సమయ పాలనకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అంటే కేటాయించిన పని ని నిర్దిష్ట వేళల్లో పూర్తి చేయటం అన్న మాట.

అలాగే మనం ఆహారం తీసుకోవటం విషయంలోనూ ఇదే రకమైన సమయ పాలన్ని పాటించాలి. అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ తీసుకోవటం వంటి నాలుగైదు సెగ్మంట్ లుగా ఆహారం తీసుకోవటం చాలా మందికి అలవాటు. ఈ అలవాటుని జాగ్రత్తగా పాటించాలి. అంటే ప్రతీ రోజు దాదాపుగా అదే సమయానికి ఆ రకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీసుకి వెళ్లటం లేదంటే ఇంటి పని చేసుకోవటం అలవాటు ఉంటే అలాగే ఈ పనిని చేసుకోవాలన్న మాట.
దీని వల్ల క్రమం తప్పకుండా ఆహారం సక్రమంగా జీర్ణం అయి, జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. శరీరానికి క్రమం తప్పకుండా శక్తి అందుతుంది.


క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోండి..!




ప్రపంచ క్యాన్సర్ డే. అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు క్యాన్సర్ గురించి తెలుసుకొనే రోజు అన్నమాట.
వాస్తవానికి క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. ఇది సరి కాదు. శరీరంలో ఏదో ఒక భాగంలో అవాంఛనీయ కణజాలం పేరుకొనిపోయి కణితిగా మారుతుంది. ఇది క్రమేపి పెరిగిపోయి సజీవ కణజాలాన్ని తినివేస్తూ విస్తరించటాన్ని క్యాన్సర్ అంటారు. కణితి లు అన్నీ క్యాన్సర్ కాదని గుర్తించుకోవాలి. ఇది శరీరంలోని ప్రధానభాగాలైన ఎముకలు, గొంతు, వంటి భాగాలతో పాటు జీర్ణావయవాలైన కడుపు, కాలేయం, క్లోమం వంటి భాగాల్లో ఏర్పడవచ్చు.
జీర్ణ వ్యవస్థ లో ఏర్పడే క్యాన్సర్ కు ఇప్పుడు చికిత్సలు లభిస్తున్నాయి. ర్యాడికల్ సర్జరీ ద్వారా క్యాన్సర్ ఏర్పడిన భాగాన్ని తొలగించి చికిత్స చేయటానికి వీలవుతుంది. దీంతో పాటు అడ్వాన్సు డ్ దశల్లో కీమో థెరపీ, రేడియో థెరపీ లు చేయటంతో పరిష్కారం చేయవచ్చు. క్యాన్సర్ లో మొదటి , మద్య దశ వరకు చికిత్సలు సాధ్యం అవుతున్నాయి. మరీ ముదిరిపోయిన దశలో కూడా నాణ్యమైన శేష జీవితాన్ని అందించటానికి వీలవుతుంది.


అమీబియాసిస్ కు అరవై కారణాలు

మన జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోనప్పుడు అమీబియాసిస్ వచ్చే అవకాశం ఉంది. నోటి ద్వారా కడుపులోకి తీసుకునే ఆహారం కారణంగానే ఈ వ్యాధి వస్తుంది. సహజంగా కలరాకు దారితీసే లక్షణాలన్నీ అమీబియాియాసిస్ కు దారితీస్తాయి. తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవడం ద్వారా అమీబియాసిస్ ను నియంత్రించవచ్చు.

                 పొగత్రాగడం, ఆల్కహాల్ సేవనం, గుట్కాలు, జర్దాలు, అమీబియాసిస్ ను మరింత పెంచుతాయి. పైగా కడుపులో అల్సర్లు రావడానికి కారణమౌతాయి.అమీబియాసిస్ లో పేగులు బాగా దెబ్బతింటాయి. దీని వల్ల దీర్ఘకాలం పాటు తిన్న ఆహారం జీర్ణం కాకుండా అలాగే ఉండిపోయి, సూక్ష్మజీవులకు నివాసస్థానంగా మారుతుంది. సూక్ష్మజీవులు పెరిగేకొద్దీ వ్యాధి తీవ్రత బాగా పెరుగుతుంది. 

కలరా వస్తే కలవరపడొద్దు

సాధారణంగా విరేచనాలు అవుతున్నాయని రోగులు డాక్టర్లకు చెబుతుంటారు. అయితే అన్ని విరేచనాలు ఒకేలా ఉండవు. అవి ఎప్పట్నుంచి అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి. విరేచనాల రంగు, వాసన ఎలా ఉందనే విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. వీటిని బట్టే డాక్టర్లు రోగికి చికిత్స విధానాన్ని నిర్ణయించగలుగుతారు. విరేచనాలకు ముందు రోగి ఏం తిన్నాడు, ఏ సమయంలో తిన్నాడనేది కూడా కలరా అవునో, కాదో నిర్థారించుకోవడానికి సహాయపడుతుంది.

                     కేవలం విరేచనాలు తగ్గించడానికి మందులివ్వడానికి ముందే.. రోగి గుండెపోటు, రక్తప్రసరణ సరిగ్గా ఉందో లేదో డాక్టర్లు అంచనా వేస్తారు. విరేచనాలు ఎలా అవుతున్నాయనే విషయాన్ని బట్టి.. అది కేవలం విరేచనాలో కాదో నిర్థారణకు వస్తారు. విరేచనాలతో పాటూ మూత్రం పడుతుంటే చాలా అపాయకరమైన పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. ఇక మూత్రం అయిన తర్వాత కూడా విరేచనాలు ఆగకపోతే అది మరింత ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచచ్చు. కలరా వచ్చినప్పుడు కలవరపడకుండా డాక్టర్ని సకాలంలో సంప్రదించడం ఉత్తమం.

అజీర్తే విరేచనాలకు మూలం

స్ప్రూ అనే విరేచనాల వ్యాధిలో అమిత దుర్వాసన ఉంటుంది. దీర్ఘకాలం విరేచనాలు ఉండటం వల్ల రోగి బరువు కోల్పోతాడు. ఇనుము వంటి పోషక పదార్ధాలు ఒంటికి వంటబట్టకపోవడంతో రోగి క్షీణించి పాలిపోతాడు. పాలు, గుడ్లు వంటివి సరిపడని శరీర తత్వం ఉన్న వ్యక్తులు జీర్ణశక్తి బాగా తక్కువగా ఉన్నప్పుడు అవి తీసుకుంటే.. తీవ్రమైన ఎలర్జీ లక్షణాలు వచ్చి విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

                         పేగులోపల విపరీతంగా పూసి పుళ్లు పడిపోయినప్పుడు అల్సరేటివ్ కోవైటిస్ అంటారు. రక్తంతో కూడిన విరేచనం, కడుపులో నొప్పి, జ్వరం ఉంటున్నప్పుడు పేగుల్లో ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని గమనించాలి. ఎపెండిసైడిటిస్ అనే కడుపు నొప్పితో కుడివైపుగజ్జల్లో నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లివర్ జబ్బుతో బాథపడే వ్యక్తికి కుడివైపు డొక్కల్లో నొప్పి వస్తుంది. పేగుల్లో ఏర్పడే తేడాల వల్ల విరేచనాలు, కడుపు నొప్పి వస్తాయి. 

కలరాతో జాగ్రత్త..!

ఆహారం ద్వారా, నీటిద్వారా కడుపులోకి చేరే హానికారక బ్యాక్టీరియా కారణంగా కలరా వస్తుంది. ఈ బ్యాక్టీరియా విరేచనాల వ్యాధికి కారణం అవుతాయి. కలరా ఊరంతా వ్యాపించినప్పుడు అతిసారం అంటారు. ఊళ్లో కలరా కేసులు ఉన్నాయని తెలిసినప్పుడు తక్కిన జనాభా అంతా కలరా వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. మానసిక వ్యాధులు, నాడీ సంబంధ వ్యాధులు కూడా ఈ వ్యాధి రావడానికి కారణం అవుతాయి.

        అమీబిక్ డిసెంట్రీ వంటి వ్యాధులు, పేగుల్లో టీబీ సూక్ష్మజీవుల వల్ల ఏ్పడే విరేచనాల వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశం ఉంది. జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి రావచ్చు. శరీరానికి సరిపడని ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి స్థితి వస్తుంది. పేగుపూత, క్రిమిసంహారకాలు పొరపాటున ఆహారం ద్వారా కడుపులోకి వెళ్లడం వల్ల కూడా కలరా వస్తుంది. 

ఎసిడిటీకి కారణాలెన్నో..!

కడుపులో మంటకు ఎసిడిటీయే కారణమని మనందరికీ తెలుసు. అతిగా ఆహారం తీసుకున్నా.. తీసుకోవాల్సినంత ఆహారం తినకపోయినా ఎసిటిడీ వస్తుంది. కాబట్టి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ప్రధానం. కడపులో మంట కారణంగా పనిచేయగల శక్తి తగ్గిపోతుంది. పుల్లటి తేన్పులు వస్తాయి. నోరు చేదుగా ఉంటుంది. పొట్ట బరువెక్కినట్లవుతుంది. కడపులో ఏదో ఉండ చుట్టినట్లు అనిపిస్తుంది.

                    గొంతులో, గుండెలో మంటగా అనిపిస్తుంది. అన్నం సహించదు. మలబద్ధకంతో పాటు మలం పచ్చగా మారుతుంది. విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఒక్కోసారి ఆ నొప్పి తగ్గడానికి  మందులు  మింగడం వల్ల మరింత ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది.  వికారంగా ఉంటుంది. గుండెల్లో, ఛాతిలో నొప్పి వచ్చి గుండెపోటు వస్తుందేమోనన్న భయం కలుగుతుంది. భయం కారణంగా అలసట, కడపులో గడబిడ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. 

కడుపు డస్ట్ బిన్ చేయొద్దు

మనకు వచ్చే వ్యాధుల్లో చాలావరకు తినే ఆహారం వల్లే వస్తాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కడుపులోకి తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటే.. మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని పెద్దలు చెబుతారు. శుభ్రత లేని ఆహారం తింటే వ్యాధులు చుట్టబెడతాయి. ముందుగా కడుపు ఉబ్బరంతో మొదలైన వ్యాధులు ముప్పేట దాడి చేస్తాయి. కడుపు ఉబ్బరానికి ఆరోజు తిన్న ఆహారమే కారణం కాదు.. కొన్నిరోజులుగా అశుభ్రమైన ఆహారం తినడమే అసలు కారణం.
     మనం బయట తినే తిళ్లను కడుపు అరాయించుకోలేకపోతే.. అవి లోపలే పేరుకుని కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయి. కడుపు ఉబ్బరం పెరిగి మలబద్ధకంగా మారుతుంది. కాబట్టి తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హోటల్ ఫుడ్, చిరుతిళ్లు తినేముందు అవి ఎలాంటి వాతావరణంలో తయారుచేస్తాయో గమనించడం చాలా ముఖ్యం. లేకపోతే మనం తినే చిన్నమొత్తం ఆహారం.. పెద్దమొత్తంలో అనారోగ్యానికి కారణమౌతుంది. కాబట్టి బయట చిరుతిళ్లు తినేవారూ పారాహుషార్. 

కడుపు మంట - అజీర్తి

ఒక్కోసారి విపరీతమైన ఆకలి వేస్తుంది. వడ్డించింది సరిపోదేమో అనిపిస్తుంది. కానీ కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకో ముద్ద తిందామంటే  పొట్ట బరువెక్కిపోతుంది. ఇంక మెతుకు కూడా దిగని పరిస్థితి వస్తుంది. సరే అని చెయ్యి కడుక్కుంటే.. మళ్లీ కాసేపటికే ఆకలి వేస్తుంది. తట్టుకోలేక ఏది కనిపిస్తే అది తినేద్దాం అనిపిస్తుంది. ఇదే అజీర్తి కథ.
           ఇప్పటిదాకా వేసింది నిజమైన ఆకలి కాదు. మాయా ఆకలి. అది కడుపులో మంట. కడుపులోకి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అలాగే ఉండిపోవడం వల్ల అజీర్తి చేస్తుంది. ఆహార పదార్థాల ఆమ్లీకరణ తర్వాత చిన్నపేగుల్లో శోషణ జరుగుతుంది. తర్వాత పెద్దపేగుల ద్వారా మూత్రపిండాల్లోకి వ్యర్థపదార్థాలు చేరతాయి. అయితే శోషణ సరిగా జరగకపోతే అజీర్తి వస్తుంది. 

అన్నం తినకపోవడం.. దీర్ఘకాలిక వ్యాధి

వ్యక్తిగత అలవాట్లను బట్టి జీవితాంతం వెంటాడే సమస్య గ్యాస్ ట్రబుల్. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీన్నేగ్యాస్ట్రైటిస్ అని కూడా అంటారు. గ్యాస్ట్రైటిస్ లో పేగుల్లోపలి పొరలు వాచిపోతాయి. అన్నం సహించకపోవడం, ఆకలి లేకపోవడం, వికారం, విరోచనాలు వంటివి గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. సాయంకాలం కంటే పొద్దున పూటే ఈ బాథలు ఎక్కువగా ఉంటాయి. పేగుపై పూత అంటే గ్సాస్ట్రిక్ అల్సర్ ఉన్నా కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. ప్యాంక్రియాజ్ క్యాన్సర్ వచ్చినప్పుడు, లివర్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
            రోజువారీ తినే అన్నమా కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఆ అన్నం తినే అలవాట్లను బట్టి కూడా దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలను అంచనా వేయొచ్చు. ఎప్పుడో ఓసారి అన్నం మానేస్తే పర్వాలేదు కానీ.. తరచుగా అన్నం తినాలని అనిపించకపోతే మాత్రం తప్పనిసరిగా అనునామనించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ అన్నం తినాలనిపించకపోవడం టీబీ, క్యాన్సర్, గ్యాస్ట్రైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

అన్నం సహించట్లేదా..?

అన్నం వాసన తెలియకపోవడం, అీన్నపు రుచి తెలియకపోవడం, ఆస్వాదించలేకపోవడం, ఒక రుచికి, మరో రుచికి తేడా తెలియక పోవడం, నోటిలోపల అసహ్యకరమైన ఏదో రుచి ఉండటం వంటివన్నీ.. అన్నం సహించట్లేదనడానికి సంకేతాలు. నోటి దుర్వాసన, మన ఊపిరి ఇతరులకు అసహ్యం కలిగిస్తుందనే భయంతో శ్వాస బిగపట్టడం కూడా దీని లక్షణాలే.
       రక్తహీనత కారణంగా రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోయి ఆ ప్రభావం ఎర్రరక్తకణాలతో పాటు జీర్ణకోశవ్యవస్థ మీద కూడా ఉంటుంది. దీని వల్ల ఆక్సిజన్ శరీరానికి అందడం తగ్గిపోయి జీవక్రియలో లోపాలు ఏర్పడతాయి. వీటితో పాటు మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. ఆకలి మందగించడం, వికారం, మలబద్ధకం వంటి వన్నీ రక్తహీనత లక్షణాలే. 

కడుపు మంటే.. పేగుపూత

మనకు చాలా కోపం వచ్చినప్పుడు తెలియన ఆందోళన, అసంతృప్తికి గురవుతాం. కొంతమందికి కోపం వస్తే వాళ్లేం చేస్తున్నారో కూడా వారికే తెలియదు. అనవసర ఆందోళన, అసంతృప్తి కోపంతో పాటు కడుపు మంటకు కూడా కారణమౌతాయి. కడుపుమంట దీర్ఘకాలం ఉంటే అది పుళ్లుగా ఏర్పడి.. పేగుపూతకు దారితీస్తుంది. నాలికపూస్తే ఎర్రగా అయి మంట పెట్టినట్లే.. పేగుల్లో యాసిడ్ ఎక్కువైతే ఎర్రగా మారి పొక్కిపోతాయి.
             పేగుపూత ఉన్నవారికి పొట్ట మీద చెయ్యి వేస్తే నొప్పిగా ఉంటుంది. కడపు లోపల్నుంచి విపరీతమైన నొప్పి ఉంటుంది. కొంతమందికి ఆహారం తీసుకుంటే నొప్పి పెరుగుతుంది.  భోజనం చేయగానే అనీజీగా ఉంటుంది. వికారం వాంతి వస్తున్నట్లు ఉంటుంది. భోజనం కాస్త ఆలస్యమైతే కడుపులో ఏదో అవుతున్నట్లుగా ఉంటుంది. కొంచెం తినగానే కడపు నిండటం, మళ్లీ వెంటనే ఆకలి వేయడం పేగుపూత లక్షణాలు. పేగుపూత లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.

బయటి తిళ్లతో జాగ్రత్త..!

బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో టైం పాస్ కోసం బయటి తిళ్లు తినడం మనలో చాలా మందికి ఉండే అలవాటు. అయితే మనం తీసుకునే ఆహారపదార్ధాలు శుభ్రంగా ఉన్నాయో.. లేదో చూసుకోకపోతే అవి గ్యాస్ట్రైటిస్ కు దారితీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 
1. సాధారణంగా రైలు, బస్సు ప్రయాణాల సమయంలో బయటి ఆహారపానీయాలు తీసుకుంటాం. వీటిలో చాలావరకు అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయబడతాయి. 
2. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు విందు భోజనంలో కూడా ఆహారం, పానీయాలు తినడం, తాగడం తప్పనిసరి. ఇక్కడ ఆహారం కూడా ఎంతో కొంత కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. 
3. హోటళ్లలో, హాస్టళ్లలో, మిర్చిబళ్ల దగ్గర తినే ఆహారం ఎక్కువశాతం కలుషితమై ఉంటుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. 
4. ఇంట్లో తాగే నీరు కూడా పంచాయతీ, మున్సిపాలిటీ సప్లై చేసే నీళ్లు ఎంతవరకు శుభ్రంగా ఉంటుందో చెప్పడం కష్టమే. కలుషిత నీరు తాగినా గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సుంది.  
5. గోళ్లల్లో ఉండే మట్టి కూడా తినే ఆహారం ద్వారా పేగుల్లోకి చేరి రోగాలకు దారితీస్తుంది.