...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఆహార‌మే మ‌హాభాగ్యం


సామెత కొద్దిగా మారిన‌ట్లు అనిపిస్తోంది క‌దా..! ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారు క‌దా, కానీ, ఈ ట్విస్ట్ ఏమిటి అనుకొంటున్నారా.. దీనికి ఒక కార‌ణం ఉంది. ఆరోగ్యానికి మూలం ఆహారం అన్న మాట‌. క‌లుషిత ఆహారంతో దాదాపు 35 శాతం దాకా క్రిములు వ్యాపిస్తాయ‌ట‌. ఆహారం జాగ్రత్తగా తీసుకొంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే ఆహారపు అల‌వాట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వానలు ప‌డినప్పుడు సూక్ష్మక్రిములు ఎక్కువ‌గా వ్యాపిస్తాయి. వీటిని గుర్తించి ఆహారంలో మ‌లిన ప‌దార్థాలు లేకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వ‌ర‌కు బ‌య‌ట ఆహారం తీసుకోకుండా ఉంటే మేలు. ఇది అన్ని వేళ‌లా సాధ్యం కాదు, కాబ‌ట్టి బ‌య‌ట ఆహారం తీసుకొనేట‌ప్పుడు న‌మ్మక‌మైన చోట మాత్రమే తీసుకోవాలి. రోడ్ వెంబ‌డి ఉండే చాట్ బండ్ల ద‌గ్గర చాట్ లాగించేసే అల‌వాటు ఉంటే కాస్తజాగ్రత్త  తీసుకోవాలి. రోడ్ వెంట ఉండే సూక్ష్మక్రిములు ఈ ఆహారాన్ని ఆశిస్తాయి. దీంతో ఇబ్బంది త‌ప్పదు. ఆహారంతో పాటు తాగునీరు కూడా ముఖ్యమే. తాగునీరు లో మురికి నీరు క‌లిసిపోతే, క్రిములు వ్యాపించ‌టం త‌థ్యం. అందుకే తాగునీరు విష‌యంలో కూడా జాగ్రత్త త‌ప్పనిస‌రి...

No comments:

Post a Comment