...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఉగాది విశిష్టత తెలుసుకోవాల్సిందే..!

ఉగాది అన‌గానే అంద‌రికీ గుర్తుకొని వ‌చ్చేది ఉగాది ప‌చ్చడి. ఆ రోజున త‌ప్పనిస‌రిగా ప‌చ్చడి తిన‌టం తెలుగు వారి సాంప్రదాయం. దీన్నే క‌న్నడంలో బేవు బెళ్ల అని పిలుస్తారు.

ఉగాది ప‌చ్చడిలో చేదు, తీపి, కారం, పులుపు, ఉప్పు, వ‌గ‌రు అనే ఆరు ర‌కాల రుచులు ఉంటాయి. ఇందుకోసం వేప పూవు, బెల్లం, మిర్చి, ఉప్పు, చింత‌పండు, మామిడి కాయ ఉప‌యోగిస్తారు. ఈ ఆరు ర‌కాల ప‌దార్థాల్లోనూ ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని త‌గినంత‌గా జోడించి త‌యారు చేసిన ప‌చ్చడి తిన‌టం ద్వారా వీటిలోని ఔష‌ధ గుణాలు శ‌రీరానికి అందుతాయి. ముఖ్యంగా చేదు, వ‌గ‌రు వంటి రుచుల్ని విడిగా తినేందుకు జ‌నం ఇష్ట ప‌డ‌రు. తీపి, కారం, ఉప్పు ఎక్కువ‌గా లాగిస్తుంటారు. వీటిని ఎక్కువ‌గా తిన‌టం తో ఎంత‌టి స‌మ‌స్యో, చేదు వ‌గ‌రు ని వ‌దిలేయటం అటువంఇ స‌మ‌స్యకు దారి తీస్తుంది. అందుచేత ఇటువంటి సంద‌ర్భాల్లో ఆయా రుచుల్ని ప‌రిచ‌యం చేసేందుకు పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పెట్టినట్లు తెలుస్తోంది. అలాగ‌ని ఈ ప‌చ్చడిని విప‌రీతంగా తింటే మాత్రం చేటు త‌ప్పదు సుమా..!

No comments:

Post a Comment