...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

వాళ్లకు లోక‌మంతా ప‌చ్చగా క‌నిపిస్తోందా..!

ప‌చ్చ కామెర్లు వ‌స్తే లోక‌మంతా ప‌చ్చగా క‌నిపిస్తుంది అని సామెత ఉంది. ఇది ఎందుకు పుట్టిందంటే కామెర్లు వ‌చ్చిన‌ప్పుడు క‌ళ్లు ప‌చ్చగా మార‌తాయి. దీంతో అన్నీ ప‌చ్చగా క‌నిపిస్తుంటాయ‌ని చెబుతారు. వాస్తవానికి క‌ళ్ల లో బైలిరూబిన్ అనే వ‌ర్ణ కం పేరుకొని పోవ‌టం వ‌ల‌న ఈ ప‌రిస్థితి ఏర్పడుతుంది. సాదార‌ణంగా క‌ళ్లు ప‌చ్చబ‌డిన‌ప్పుడే కామెర్లుగా చెబుతారు.

అయితే ఇక్కడ ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. కామెర్ల వ్యాధి కి త‌గిన చికిత్స తీసుకొంటే కొన్ని రోజుల‌కే త‌గ్గిపోతుంది. ఒక్కో సారి శ‌రీరంలో వ్యాధి త‌గ్గిపోయినా కూడా క‌ళ్లకు ఉండే ప‌చ్చద‌నం త‌గ్గదు. దీనికి కార‌ణం ఏమిటంటే అక్కడ పేరుకొన్న బైలిరూబిన్ వ‌ర్ణకం పూర్తిగా తొల‌గిపోవ‌టానికి స‌మ‌యం ప‌డుతుంది. ఒక్కోసారి 3-4 వారాల స‌మ‌యం ప‌డుతుంది. అంటే అటువంట‌ప్పుడు శ‌రీరంలో కామెర్లు త‌గ్గిపోయినా, క‌ళ్లలో మాత్రం ప‌చ్చద‌నం నిలిచే ఉంటుంది.

No comments:

Post a Comment