...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

విభ‌జ‌న స‌మ‌యంలోముంద‌స్తు జాగ్ర‌త్త‌

ఏ ప‌నయినా ఒకేలా చేయ‌టానికి అల‌వాటు ప‌డి ఉంటాం. ఆహారం తీసుకొనే ట‌ప్పుడు కూడా చిన్న‌ప్ప‌టి నుంచి ఉన్న అల‌వాటునే అనుస‌రిస్తాం త‌ప్ప కొత్త‌గా ఆలోచించం.
రెండు   సార్లు ఆహారం తీసుకోవ‌టం మ‌న‌లో చాలా మందికి అల‌వాటు. ఇది స‌రైన‌దే అని అనిపిస్తుంది. ప‌నుల హ‌డావుడిలోనో, వేరే కార‌ణం తోనో ఉద‌యం పూట బ్రేక్ ఫాస్ట్ ను దూరం పెట్టేస్తుంటారు. దీంతో మ‌ధ్యాహ్నానికి ఆక‌లి పెరిగి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకొంటారు.

ఆ త‌ర్వాత భుక్తాయసంతో వెంట‌నే విశ్రాంతి కి  ప్ర‌య‌త్నిస్తారు. రాత్రి కూడా అదే చేస్తుంటారు. సాయంత్రం ఏమీ తీసుకోకుండా ఖాళీగా ఉండి రాత్రి పూట మాత్రం ఎక్కువ‌గా లాగించేస్తారు. ఆ త‌ర్వాత వెంట‌నే నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తారు.దీంతో శ‌రీరంలో కొవ్వులు పేరుకొని పోతాయి.
ఆహారం తీసుకొనేట‌ప్పుడు విభ‌జ‌న చాలా ముఖ్యం. ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్టు చేయ‌టం, త‌ర్వాత రోజూ ఒకే స‌మ‌యానికి లంచ్ తీసుకోవ‌టం మ‌రింత ముఖ్యం. సాయంత్రం స‌మ‌యంలో కొద్ది పాటి స్నాక్స్ తీసుకోవ‌టం ద్వారా నీర‌సం రాకుండా చేయ‌వ‌చ్చు. అప్పుడు సాయంత్రం తేలిక‌పాటి ఆహారాన్ని తీసుకొనేందుకు వీల‌వుతుంది. ఈ ర‌కంగా ఆహారాన్ని విభ‌జించి విడ‌త‌ల వారీగా తీసుకోవ‌టం మంచిది.

No comments:

Post a Comment