...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఫ‌లితాలు వ‌చ్చాక కూడా వ‌దిలేస్తే ఎలా..?

చాలా మంది ఫ‌లితాల మీద ప‌రి పరి విధాల ఆలోచ‌న‌లు చేస్తుంటారు. పేషంట్లు ఒక స‌మ‌స్య‌తో బాధ ప‌డుతూ ఉన్న‌ప్పుడు మ‌రి కొన్ని ఇబ్బందులు కూడా క‌లుస్తుంటాయి. అటువంట‌ప్పుడు కొన్ని ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు అవ‌స‌రం అవుతాయి.అ వి చేయించుకొన్న‌ప్పుడే సమస్య‌ను పూర్తిగా అర్థం చేసుకోవ‌డానికి వీల‌వుతుంది.

చాలా మంది రోగులు స‌మ‌స్య ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు తొంద‌ర ప‌డ‌తారు. తాత్కాలికంగా ఉప‌శ‌మ‌న మందులు వాడిన‌ప్పుడు స‌మ‌స్య నివార‌ణ అయితే, దాన్ని అలా వ‌దిలేస్తారు. రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకొమ్మ‌ని వైద్య స‌ల‌హా ఇచ్చిన‌ప్ప‌టికీ బ‌ద్ద‌కించేస్తారు. మ‌రి కొంత‌మంది అయితే నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకొన్నాక ఫ‌లితాలు వ‌చ్చాక కూడా ప‌క్క‌న పెట్టేస్తుంటారు. తాత్కాలికంగా స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింది క‌దా అని ఊరుకొంటారు. ఇది స‌రైన విధానం కాదు ఒక సారి స‌మ‌స్య‌ను గుర్తించాక శాస్త్రీయంగా చికిత్స చేయించుకోవ‌టం అవ‌స‌రం. అప్పుడే స‌మ‌స్య‌కు పూర్తి ప‌రిష్కారం దొర‌కుతుంది లేక పోతే లోప‌ల్లోప‌ల స‌మ‌స్య మ‌రింత‌గా ముదిరే చాన్సు ఉంది. అప్పుడు చికిత్స అందించ‌టం క‌ష్టం అవుతుంది. క్రానిక‌ల్ డిసీజెస్ లో తొంద‌ర‌గా వ్యాధి నిర్ధార‌ణ‌, చికిత్స అందించ‌టం ముఖ్యం అని గుర్తించుకోవాలి.

No comments:

Post a Comment