...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఉప్పు చేసి త‌ప్పు కూడు..!

 ఇదేదో అక్షర దోషం అనుకోవ‌ద్దు సుమా. ఇది వాస్తవం. అప్పు చేసి పప్పు కూడు తిన‌వ‌ద్దని సామెత ఉంది. ఆ విష‌యాన్ని ప‌క్కన పెడితే ఉప్పు తో చేసిన ఆహారం ఎంత వ‌ర‌కు అవ‌స‌రం అన్నది తెలుసుకోవాలి. ఉప్పు లేనిదే ఇంట్లో కూర‌లు, ప‌చ్చళ్లు సాధ్యం కాదు. వీటితో పాటు పెరుగు లేక మ‌జ్జిగ లో కూడా ఉప్పు వాడే అల‌వాటు ఉంటుంది.

వాస్తవానికి ఉప్పు తోటే రుచి వ‌స్తుంది. ఇందులోని సోడియం ల‌వ‌ణం రూపంలో శ‌రీరానికి స‌హ‌క‌రిస్తుంది. కానీ, ఇది ఎక్కువ అయినా, త‌క్కువ అయినా ఇబ్బందే. వాస్తవానికి ఒక రోజుకి ఒక మ‌నిషికి1,500మి.గ్రా. ఉప్పు స‌రిపోతుంది. అంటే అర స్పూన్ ఉప్పు అన్నమాట‌. న‌లుగురు ఉన్న కుటుంబంలో కూర, ప‌చ్చళ్లు, సూప్ త‌యారు చేసుకొంటే అందులో రెండు స్పూన్ లు ఉంటే చాలు అన్న మాట‌. అది కూడా ఉద‌యం బ్రేక్ ఫాస్ట్, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్ లో క‌లుపుకొని లెక్క వేసుకోవాలి. ఇక‌, పెరుగు లేక మ‌జ్జిగ లో సాల్ట్ క‌లుపుకొంటే ఒక‌టిన్నర స్పూన్ సాల్ట్ తీసుకొన్నట్లు అవుతుంది. అంటే దాదాపు 4,500 మి.గ్రా. తీసుకొన్నట్లు అన్న మాట‌. దీని వ‌ల‌న ర‌క్తంలో సోడియం శాతం పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెజ‌ర్‌, హైప‌ర్ టెన్సన్ వంటి స‌మ‌స్యల‌కు దారి తీస్తుంది. అందుచేత ఆహారంలో ఉప్పు శాతం ప‌రిమితంగా ఉంచుకొంటే అనారోగ్యం దూరంగా ఉంటుంది. అప్పుడు త‌ప్పు ఆహారం తీసుకోకుండా ఉండ‌వ‌చ్చు.

No comments:

Post a Comment