...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఢిల్లీ లో ప‌ల్స్ ఏమిటి.. ఏం చేయ‌బోతున్నారు..!

ఢిల్లీ అంటే దేశానికి అంత‌టికీ రాజ‌ధాని. అక్కడ జ‌రిగే యాక్టివిటీస్ గురించి అంద‌రికీ బాగా ఆసక్తి ఉంటుంది. స‌రి క‌దా, అన్ని రాష్ట్రాల ప్రజ‌ల‌కు అనుబంధం ఉంటుంది. అందుకే ఢిల్లీ ప‌ల్స్ కు అంత‌టి ప్రాధాన్యం ఉంటుంది.
అస‌లు ప‌ల్స్ అంటే వైద్య విద్యార్థుల క‌ల‌యిక అని అర్థం. ఢిల్లీ లో ఉండే అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా మెడిక‌ల్ కాలేజీలు ఉన్నప్పటికీ, ఎయిమ్స్, ల‌క్నో లో ఉండే సంజ‌య్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌జిపిజిఐ), జిప్‌మ‌ర్ వంటి సంస్థలు చాలా ప్రతిష్టాత్మక‌మైన‌వి. అక్కడ చ‌దువుకొన్న వైద్య శాస్త్ర వేత్తల‌కు ఆయా స‌బ్జెక్టు ల్లో గట్టి ప‌ట్టు దొర‌కుతుంది. ఆయా స‌బ్జెక్టుల్లో నిష్ణాతులుగా త‌యారు చేయ‌టానికి ఈ సంస్థలు అంత‌ర్జాతీయంగా పేరు గ‌డించాయి.

 ఎస్‌జిపిజిఐ లో గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ గా ప‌రిశోధ‌న‌లు చేసిన‌ప్పుడు వైద్య వృత్తిని త‌పస్సు లా భావించాల‌ని అర్థం అయింది. ఒక రుషి మాదిరిగా అధ్యయ‌నం చేస్తేనే వైద్య వృత్తి లో ప‌ట్టు సాధించ‌వ‌చ్చని అర్థం అయింది. అందుకే తోటి మెడికోల‌ను క‌లిసిన‌ప్పుడు వారి అధ్యయ‌న రీతులు తెలిసేవి. స‌రిగ్గా ఈ క‌ల‌యిక దిశ‌గానే ప్రతీ ఏటా  వైద్య విద్యార్థుల‌కు ఢిల్లీ లో ప‌ల్స్ పేరుతో ఒక స‌మ్మేళ‌నం నిర్వహిస్తారు. భార‌త్ నుంచే గాకుండా అనేక ద‌క్షిణాసియా దేశాల నుంచి వైద్య విద్యార్థులు, ప‌రిశోధ‌కులు ఇక్కడ‌కు హాజ‌ర‌వుతుంటారు.
ఇటు వైద్య వృత్తి లో ఉన్న వారు కూడా ఎప్పటిక‌ప్పుడు అప్ డేట్ విజ్ఞానం తెలుసుకొంటూ ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా   వైద్య రంగంలో జ‌రిగే ప‌రిశోధ‌న‌ల వివ‌రాలు ఎప్పటిక‌ప్పుడు తెలుసుకొంటూ ఉండాలి. అందుకే వృత్తి ప‌ర‌మైన స‌ద‌స్సులు జ‌రుగుతు ఉంటాయి. దేశ వ్యాప్తంగా ఉండే జీర్ణ కోశ వ్యాధుల నిపుణుల‌కు జాతీయ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల అసోసియేష‌న్ ఉంది. దీనికి జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ గా అనేక సెమినార్ లు నిర్వహించిన‌ప్పుడు అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న‌ల వివ‌రాలు చెప్పటానికి ప్రాధాన్యం ఇస్తుంటాను. త్రివేండ్రం, బెంగ‌ళూరు, గౌహ‌తి వంటి చోట్ల ఈ మ‌ధ్య కాలంలో అక్కడ స‌ర్జన్ ల‌కు శిక్షణ ఇచ్చిన‌ప్పుడు ఎన్నో అంశాలు ప్రస్తావ‌న‌కు వ‌చ్చాయి. ఒక‌ప్పటితో పోల్చిన‌ప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో జీర్ణ కోశం, కాలేయం, క్లోమం వంటి అంత‌రాంగాల చికిత్సలో అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. వీటిని తెలుసుకొని అవ‌గాహ‌న‌తో మెలిగితే దీర్ఘకాలిక రోగాలు కూడా న‌యం అవుతాయి. పెద్ద రోగం ఉంద‌ని తెలిసిన‌ప్పుడు కంగారు ప‌డ‌కుండా మెరుగైన చికిత్సలు మ‌న భార‌త్ లో, మ‌న హైద‌రాబాద్ లో అందుబాటులో ఉన్నాయని చెప్పట‌మే నా ఉద్దేశం సుమా..అంత‌కు మించి ఢిల్లీ ప‌ల్స్ గురించి నేను వివ‌రాలు అందించ‌టం లేదు.

No comments:

Post a Comment